Movie News

ఏపీలో టికెట్ల రేట్లపై దర్శకేంద్రుడి ఆవేదన

తెలుగు సినిమాల వరకు మేజర్ మార్కెట్ షేర్.. ఆంధ్రప్రదేశ్ ‌నుంచే వస్తుంది. మన సినిమాలకు ఎక్కువగా బిజినెస్ జరిగేది.. వసూళ్లు ఎక్కువగా వచ్చేది ఏపీ నుంచే అన్నది అందరికీ తెలిసిన విషయం. బేసిగ్గానే ఆంధ్రా జనాలకు సినిమా అభిమానం ఎక్కువ. ఇక్కడ సినిమాలకు వచ్చే ఆదరణే వేరు.

ఐతే ఇండియాలోనే ఏరియాల పరంగా చూస్తే చాలా పెద్ద మార్కెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సినిమాలు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది వేసవిలో ‘వకీల్ సాబ్’ రిలీజైన దగ్గర్నుంచి ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడంతో ఒక్కసారిగా వసూళ్లు పడిపోయాయి. ఆ ప్రభావం సినిమాల బిజినెస్ మీదా పడింది. గత కొన్ని నెలల్లో రిలీజైన ఏ సినిమాకూ ఆంధ్రాలో ఆశించిన ఫలితం రాకపోవడానికి టికెట్ల రేట్ల మీద నియంత్రణే కారణం. పరిశ్రమ నుంచి ఎంతమంది వెళ్లి ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపినా, ఎన్ని విన్నపాలు జరిగినా అటు నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు.

పవన్ కళ్యాణ్, సురేష్ బాబు లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే దీని మీద పరిశ్రమ నుంచి ఓపెన్‌గా మాట్లాడిన వాళ్లు లేరు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో ఇప్పుడు టాలీవుడ్ దిగ్గజాల్లో ఒకరైన దర్శకేంద్రుడు ఈ విషయమై స్పందించారు. ఒక ప్రస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ఏపీలో ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లతో చాలామంది నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా అంటే థియేటర్లలో చూస్తే కలిగే అనుభూతే గొప్పదని.. కానీ ఇప్పుడు షోలు తగ్గించడం, టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల థియేటర్లను నమ్ముకున్న వాళ్లందరూ నష్టపోయి ఆ ఇండస్ట్రీ దెబ్బ తినే పరిస్థితి వచ్చిందని రాఘవేంద్రరావు అన్నారు. ఒక హిట్ సినిమాకు ఎక్కువ షోలు వేసుకుని, తొలి వారం టికెట్ల రేట్లు పెంచితే.. ఆ తర్వాత మామూలు సినిమాలు వచ్చినా, ఆదాయం తగ్గినా థియేటర్లను నమ్ముకున్న వేలాది మందికి 2-3 నెలలకు సరిపడా ఆదాయం వస్తుందని.. అసలు రిలీజయ్యే సినిమాల్లో 10 శాతం కూడా సక్సెస్ కావన్నది అందరికీ తెలిసిన సత్యం అని దర్శకేంద్రుడు అన్నారు.

ఒక హిట్ సినిమాకు 500 రేటు పెట్టినా ప్రేక్షకుడు చూస్తాడని.. బాలేని సినిమాను ఒక్క రూపాయికే చూపించినా చూడడని.. టికెట్లను పూర్తిగా ఆన్ లైన్ చేస్తే ఇన్ఫ్లూయెన్స్ ఉన్న వాళ్లు టికెట్లు బ్లాక్ చేసుకుని.. తమ వాళ్లతో బ్లాక్‌లో అమ్మే ప్రమాదం ఉందని.. ఆన్ లైన్ తప్పదనుకుంటే రేట్లు పెంచి ఆన్ లైన్లో అమ్మితే ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తుందని.. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి తగిన న్యాయం చేయాలని రాఘవేంద్రరావు కోరారు.

This post was last modified on December 1, 2021 9:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ‌లించిన ప‌వ‌న్ ప్ర‌య‌త్నం.. బ‌డ్జెట్‌లో `కొబ్బ‌రి`కి కీల‌క స్థానం

ఏపీలోని కోన‌సీమ ప్రాంతంలో కొబ్బ‌రి సాగు ఎక్కువ‌. దేశంలో కేర‌ళ త‌ర్వాత‌.. కోన‌సీమ‌లో భారీ ఎత్తున కొబ్బ‌రి సాగు చేస్తున్నారు.…

10 minutes ago

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…

19 minutes ago

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…

48 minutes ago

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

2 hours ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

3 hours ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

3 hours ago