ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాలలో చూడనటువంటి విపత్తు ఈ మధ్యకాలంలో ఏపీ చవిచూసింది. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. తిరుపతిని గత కొన్ని దశాబ్దాలలో చూడని జల విలయం చుట్టేసింది. అయితే ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా మేమున్నామని అండగా నిలబడటానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది.
ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తిన వరదలు కారణంగా నష్టపోయిన వాళ్లకు తనవంతు సహాయంగా.. ఇప్పటికే గీతా ఆర్ట్స్ తరఫున నిర్మాత అల్లు అరవింద్ 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.
ఇప్పుడు ఈ వరుసలో జూనియర్ ఎన్టీఆర్ తన వంతు బాధ్యతగా రూ. 25లక్షలను ఇస్తున్నట్లుగా తెలియజేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించిపోయాను. వారు కోలుకోవడానికి నా వంతు బాధ్యతగా రూ. 25 లక్షలను అందిస్తున్నాను..’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
ఇక, ఇదే అంశంపై సూపర్ స్టార్ మహేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 25 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లుగా తెలియజేశారు.
‘‘ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వినాశకరమైన వరదల కారణంగా నష్టపోయిన వారికి సహాయం అందించే ప్రయత్నంలో నా వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు అందిస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను..’’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…