ఇప్పుడు రాజమౌళి కుటుంబానికి ఆర్థికంగా ఏ లోటూ లేదు. రాజమౌళితో పాటు విజయేంద్ర ప్రసాద్, కీరవాణి.. ఇంకా చాలామంది కలిసి ఒక ప్యాకేజీ లాగా సినిమాలు చేస్తూ కావాల్సినంత సంపాదిస్తున్నారు. కానీ 90వ దశకంలో ఈ కుటుంబం చాలా కష్టాలు పడింది. ఆ కష్టాల గురించి రాజమౌళి, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నేపథ్యంలో రాజమౌళి ఆ రోజులను గుర్తు చేసుకోవడం, తాము కష్టాల్లో ఉన్న టైంలో సిరివెన్నెల మాటలే స్ఫూర్తిగా నిలిచి తాము నిలదొక్కకున్నామని చెప్పడం విశేషం.
1996లో తమ కుటుంబం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన అర్థాంగి సినిమాతో తాము సర్వం కోల్పోయిన స్థితిలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అనే మాటలే స్ఫూర్తిగా నిలిచి తనను నడిపించాయని రాజమౌళి తెలిపాడు.
ఆ ఏడాది డిసెంబరు 31న రాత్రి సీతారామశాస్త్రితో స్వయంగా ఇదే పాటను ఒక నోట్ బుక్లో రాయించుకుని, సంతకం తీసుకున్నానని.. తర్వాతి రోజు జనవరి 1న తన తండ్రికి ఆ కాగితాన్నే బహుమతిగా ఇస్తే ఆయన ఎంతో ఆనందించి కొత్త ఉత్సాహంతో కనిపించారని రాజమౌళి గుర్తు చేసుకున్నాడు. ఆ రకంగా తన జీవిత గమనానికి సీతారామశాస్త్రి దిశా నిర్దేశం చేశారని రాజమౌళి అన్నాడు.
తన దర్శకత్వంలో వచ్చిన సింహాద్రిలో అమ్మయినా నాన్నయినా.. మర్యాద రామన్నలో పరుగులు తీయ్ పాటలను సీతారామశాస్త్రి రాశారని.. ఐతే అమ్మా నాన్న లేకుంటే బాగుంటుందని, పారిపోవడం గొప్ప అని ఎలా రాస్తాం అని తనతో వాదించి.. చివరికి ఈ సవాళ్లను స్వీకరిస్తానని చెప్పి ఆ పాటలు రాశారని.. చివరగా ఆర్ఆర్ఆర్ కోసం దోస్తీ పాట రాశారని.. ఐతే ఆయన పాట రాస్తున్న షాట్ తీసి మ్యూజిక్ వీడియోలో పెడదామనుకున్నామని.. కానీ అప్పటికే ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో అలా చేయలేకపోయామని రాజమౌళి వివరించాడు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…