ఇప్పుడు రాజమౌళి కుటుంబానికి ఆర్థికంగా ఏ లోటూ లేదు. రాజమౌళితో పాటు విజయేంద్ర ప్రసాద్, కీరవాణి.. ఇంకా చాలామంది కలిసి ఒక ప్యాకేజీ లాగా సినిమాలు చేస్తూ కావాల్సినంత సంపాదిస్తున్నారు. కానీ 90వ దశకంలో ఈ కుటుంబం చాలా కష్టాలు పడింది. ఆ కష్టాల గురించి రాజమౌళి, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నేపథ్యంలో రాజమౌళి ఆ రోజులను గుర్తు చేసుకోవడం, తాము కష్టాల్లో ఉన్న టైంలో సిరివెన్నెల మాటలే స్ఫూర్తిగా నిలిచి తాము నిలదొక్కకున్నామని చెప్పడం విశేషం.
1996లో తమ కుటుంబం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన అర్థాంగి సినిమాతో తాము సర్వం కోల్పోయిన స్థితిలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అనే మాటలే స్ఫూర్తిగా నిలిచి తనను నడిపించాయని రాజమౌళి తెలిపాడు.
ఆ ఏడాది డిసెంబరు 31న రాత్రి సీతారామశాస్త్రితో స్వయంగా ఇదే పాటను ఒక నోట్ బుక్లో రాయించుకుని, సంతకం తీసుకున్నానని.. తర్వాతి రోజు జనవరి 1న తన తండ్రికి ఆ కాగితాన్నే బహుమతిగా ఇస్తే ఆయన ఎంతో ఆనందించి కొత్త ఉత్సాహంతో కనిపించారని రాజమౌళి గుర్తు చేసుకున్నాడు. ఆ రకంగా తన జీవిత గమనానికి సీతారామశాస్త్రి దిశా నిర్దేశం చేశారని రాజమౌళి అన్నాడు.
తన దర్శకత్వంలో వచ్చిన సింహాద్రిలో అమ్మయినా నాన్నయినా.. మర్యాద రామన్నలో పరుగులు తీయ్ పాటలను సీతారామశాస్త్రి రాశారని.. ఐతే అమ్మా నాన్న లేకుంటే బాగుంటుందని, పారిపోవడం గొప్ప అని ఎలా రాస్తాం అని తనతో వాదించి.. చివరికి ఈ సవాళ్లను స్వీకరిస్తానని చెప్పి ఆ పాటలు రాశారని.. చివరగా ఆర్ఆర్ఆర్ కోసం దోస్తీ పాట రాశారని.. ఐతే ఆయన పాట రాస్తున్న షాట్ తీసి మ్యూజిక్ వీడియోలో పెడదామనుకున్నామని.. కానీ అప్పటికే ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో అలా చేయలేకపోయామని రాజమౌళి వివరించాడు.
This post was last modified on December 1, 2021 7:54 am
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…