sirivennela
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కిమ్స్ ఆసుపత్రిలో నిమోనియాకు చికిత్స పొందుతున్న సీతారామశాస్త్రి…కొద్ది రోజులగా వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయన పరిస్థితి విషయమించడంతో మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
సీతారామశాస్త్రి వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు యోగి, రాజా ఉన్నారు. సిరివెన్నెల మరణవార్తతో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సీతారామశాస్త్రి ఇంటిపేరు చేంబోలు. ‘సిరివెన్నెల’ సినిమాలో మొత్తం పాటలు బ్లాక్ బస్టర్ హిట్ లుగా మలిచిన సీతారామశాస్త్రికి అదే ఇంటిపేరుగా మారింది. 1955 మే 20న అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల పదో తరగతి వరకు అనకాపల్లిలో చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ. చేస్తున్న సమయంలోనే ఉద్యోగంలో చేరి ‘భరణి’ కలం పేరుతో కవిత్వం రాసేవారు. ఆ తర్వాత కళాతపస్వి కె.విశ్వనాథ్ కొత్తవారికి అవకాశం కల్పిస్తున్న క్రమంలో సీతారామశాస్త్రి టాలీవుడ్ కు పరిచయమయ్యారు.
ఆ తర్వాత ‘సిరివెన్నెల’ పాటలతో తొలి నంది అవార్డును అందుకున్న సీతారామశాస్త్రి వరుసగా మూడేళ్ళు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. మొత్తం 11 సార్లు ఆయన ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు సంపాదించారు. 2019లో ఆయనను కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’లో సీతారామశాస్త్రి రాసిన “దోస్తీ…” పాట ట్రెండ్ అవుతోంది.
This post was last modified on November 30, 2021 4:59 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…