ఇప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా తమన్ పేరు చెప్పేయొచ్చు. అతను చేస్తున్న సినిమాల స్థాయి, తన మ్యూజిక్ క్వాలిటీ, అలాగే తన ఆల్బమ్లు సాధిస్తున్న విజయాల ప్రకారం చూస్తే తమన్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. కొన్నేళ్ల ముందు రొటీన్ మ్యూజిక్తో విమర్శలు ఎదుర్కొన్న తమన్.. ఆ తర్వాత తనను తాను రీఇన్వెంట్ చేసుకుని ప్రతి సినిమాకూ భిన్నమైన మ్యూజిక్ ఇస్తూ.. అదిరిపోయే పాటలు, నేపథ్య సంగీతంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
గత కొన్నేళ్లలో తమన్ చేసిన సినిమాల్లో సంగీతం పరంగా చాలా కొత్తగా అనిపించి.. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన తెచ్చుకున్న చిత్రాల్లో ‘అరవింద సమేత’ ఒకటి. ఇందులో అనగనగనగా.. పెనివిటి లాంటి పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. నేపథ్య సంగీతం పరంగా కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
ఐతే ఈ సినిమాలో తాను ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన పాటకు అనుకున్నంత పేరు రాకపోవడం బాధ పెట్టిందని తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మీరు బాగా చేసి కూడా ప్రేక్షకులు ఆదరించని పాట ఏదైనా ఉందా అని ఈ ఇంటర్వ్యూలో తమన్ను అడిగితే.. ‘‘అరవింద సమేత సినిమాలో యాడబోయినాడో పాటను నేను చాలా స్పెషల్గా భావిస్తాను. ఈ పాట చాలా కష్టపడి చేశాను. అది అంత సులభంగా చేసే పాట కాదు.
ఆ మూడ్లోకి వెళ్లడానికే చాలా టైం పట్టింది. నేను నా కుటుంబంలో జరిగిన బాధాకర సంఘటనలను గుర్తు చేసుకుని ఒక మూడ్లోకి వెళ్లి చేసిన పాట అది. దాన్ని పాడటం కూడా అంత తేలిక కాదు. నిఖిత అని వైజాగ్కు చెందిన సింగర్ను పిలిపించాం. ఆమె అద్భుతంగా ఆ పాట పాడింది. రిలీజయ్యాక ఈ పాటకు గొప్ప స్పందన వస్తుందని అనుకున్నాం. కానీ పెనివిటి, రెడ్డి ఇటు సూడు లాంటి పాటలే చాలా పెద్ద హిట్టయ్యాయి. దీనికి అనుకున్నంత స్పందన రాకపోవడం నిరాశపరిచింది’’ అని తమన్ చెప్పాడు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…