తెలుగు బిగ్ బాస్ షో అరంగేట్ర సీజన్ను జూనియర్ ఎన్టీఆర్ నడిపించాడు. తర్వాతి సీజన్కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ అయ్యాడు. కానీ అతను కూడా ఒక సీజన్తో షోకు టాటా చెప్పేశాడు. ఇక అప్పట్నుంచి అక్కినేని నాగార్జునే ఈ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు సీజన్లోనూ ఆయనే షోను నడిపిస్తున్నాడు. ఐతే గత ఏడాది నాగార్జున తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజులు షోకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం లద్దాక్ వెళ్లాల్సి రావడంతో నాగ్ షోను విడిచిపెట్టక తప్పలేదు. ఆ టైంలో సీనియర్ నటి రమ్యకృష్ణ షోను హోస్ట్ చేసింది. ఏమో అనుకున్నారు కానీ…రమ్యకృష్ణ తనదైన శైలిలో షోను నడిపించి ప్రశంసలు అందుకుంది. కొందరైతే ఆమెను ఫుల్ టైం హోస్ట్ను చేయాలని కూడా అభిప్రాయపడ్డారు. అప్పుడు నాగ్ గైర్హాజరీలో తెలుగు ‘బిగ్ బాస్’కు తోడ్పాటు అందించిన రమ్య.. ఇప్సుడు తమిళంలోనూ ఈ షోను కొన్ని రోజుల పాటు హోస్ట్ చేయబోతుండటం విశేషం.
తమిళ బిగ్ బాస్ను ఆరంభం నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ నడిపిస్తుండటం తెలిసిందే. ఈ సీజన్కు హోస్ట్ మారతారని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. కమలే మళ్లీ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఐతే షో మధ్యలో ఉండగా కమల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో అత్యవసరంగా తాత్కాలిక హోస్ట్ను తీసుకురావాల్సి వచ్చింది. తెలుగులో కొన్ని ఎపిసోడ్లను చక్కగా నడిపించిన రమ్యనే తమిళ షోకు కూడా తీసుకోవాలని నిర్ణయించారు.
రమ్యకృష్ణ బేసిగ్గా తమిళ అమ్మాయే. తమిళం బాగా మాట్లాడుతుంది. అక్కడ ఆమెకు మంచి పాపులారిటీ కూడా ఉంది. తమిళ బిగ్ బాస్ను కొన్ని రోజులు హోస్ట్ చేయడానికి ఆమెకు కూడా అభ్యంతరం లేకపోయింది. మంచి పారితోషకం కూడా ఇస్తుండటంతో సంతోషంగా ఈ పని ఒప్పుకుంది. కమల్ కోలుకుని తిరిగొచ్చే వరకు ఆమెనే తమిళ బిగ్ బాస్కు హోస్ట్గా వ్యవహరించనుంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…