తెలుగు బిగ్ బాస్ షో అరంగేట్ర సీజన్ను జూనియర్ ఎన్టీఆర్ నడిపించాడు. తర్వాతి సీజన్కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ అయ్యాడు. కానీ అతను కూడా ఒక సీజన్తో షోకు టాటా చెప్పేశాడు. ఇక అప్పట్నుంచి అక్కినేని నాగార్జునే ఈ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు సీజన్లోనూ ఆయనే షోను నడిపిస్తున్నాడు. ఐతే గత ఏడాది నాగార్జున తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజులు షోకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం లద్దాక్ వెళ్లాల్సి రావడంతో నాగ్ షోను విడిచిపెట్టక తప్పలేదు. ఆ టైంలో సీనియర్ నటి రమ్యకృష్ణ షోను హోస్ట్ చేసింది. ఏమో అనుకున్నారు కానీ…రమ్యకృష్ణ తనదైన శైలిలో షోను నడిపించి ప్రశంసలు అందుకుంది. కొందరైతే ఆమెను ఫుల్ టైం హోస్ట్ను చేయాలని కూడా అభిప్రాయపడ్డారు. అప్పుడు నాగ్ గైర్హాజరీలో తెలుగు ‘బిగ్ బాస్’కు తోడ్పాటు అందించిన రమ్య.. ఇప్సుడు తమిళంలోనూ ఈ షోను కొన్ని రోజుల పాటు హోస్ట్ చేయబోతుండటం విశేషం.
తమిళ బిగ్ బాస్ను ఆరంభం నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ నడిపిస్తుండటం తెలిసిందే. ఈ సీజన్కు హోస్ట్ మారతారని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. కమలే మళ్లీ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఐతే షో మధ్యలో ఉండగా కమల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో అత్యవసరంగా తాత్కాలిక హోస్ట్ను తీసుకురావాల్సి వచ్చింది. తెలుగులో కొన్ని ఎపిసోడ్లను చక్కగా నడిపించిన రమ్యనే తమిళ షోకు కూడా తీసుకోవాలని నిర్ణయించారు.
రమ్యకృష్ణ బేసిగ్గా తమిళ అమ్మాయే. తమిళం బాగా మాట్లాడుతుంది. అక్కడ ఆమెకు మంచి పాపులారిటీ కూడా ఉంది. తమిళ బిగ్ బాస్ను కొన్ని రోజులు హోస్ట్ చేయడానికి ఆమెకు కూడా అభ్యంతరం లేకపోయింది. మంచి పారితోషకం కూడా ఇస్తుండటంతో సంతోషంగా ఈ పని ఒప్పుకుంది. కమల్ కోలుకుని తిరిగొచ్చే వరకు ఆమెనే తమిళ బిగ్ బాస్కు హోస్ట్గా వ్యవహరించనుంది.
This post was last modified on November 28, 2021 5:50 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…