తెలుగు బిగ్ బాస్ షో అరంగేట్ర సీజన్ను జూనియర్ ఎన్టీఆర్ నడిపించాడు. తర్వాతి సీజన్కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ అయ్యాడు. కానీ అతను కూడా ఒక సీజన్తో షోకు టాటా చెప్పేశాడు. ఇక అప్పట్నుంచి అక్కినేని నాగార్జునే ఈ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు సీజన్లోనూ ఆయనే షోను నడిపిస్తున్నాడు. ఐతే గత ఏడాది నాగార్జున తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజులు షోకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం లద్దాక్ వెళ్లాల్సి రావడంతో నాగ్ షోను విడిచిపెట్టక తప్పలేదు. ఆ టైంలో సీనియర్ నటి రమ్యకృష్ణ షోను హోస్ట్ చేసింది. ఏమో అనుకున్నారు కానీ…రమ్యకృష్ణ తనదైన శైలిలో షోను నడిపించి ప్రశంసలు అందుకుంది. కొందరైతే ఆమెను ఫుల్ టైం హోస్ట్ను చేయాలని కూడా అభిప్రాయపడ్డారు. అప్పుడు నాగ్ గైర్హాజరీలో తెలుగు ‘బిగ్ బాస్’కు తోడ్పాటు అందించిన రమ్య.. ఇప్సుడు తమిళంలోనూ ఈ షోను కొన్ని రోజుల పాటు హోస్ట్ చేయబోతుండటం విశేషం.
తమిళ బిగ్ బాస్ను ఆరంభం నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ నడిపిస్తుండటం తెలిసిందే. ఈ సీజన్కు హోస్ట్ మారతారని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. కమలే మళ్లీ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఐతే షో మధ్యలో ఉండగా కమల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో అత్యవసరంగా తాత్కాలిక హోస్ట్ను తీసుకురావాల్సి వచ్చింది. తెలుగులో కొన్ని ఎపిసోడ్లను చక్కగా నడిపించిన రమ్యనే తమిళ షోకు కూడా తీసుకోవాలని నిర్ణయించారు.
రమ్యకృష్ణ బేసిగ్గా తమిళ అమ్మాయే. తమిళం బాగా మాట్లాడుతుంది. అక్కడ ఆమెకు మంచి పాపులారిటీ కూడా ఉంది. తమిళ బిగ్ బాస్ను కొన్ని రోజులు హోస్ట్ చేయడానికి ఆమెకు కూడా అభ్యంతరం లేకపోయింది. మంచి పారితోషకం కూడా ఇస్తుండటంతో సంతోషంగా ఈ పని ఒప్పుకుంది. కమల్ కోలుకుని తిరిగొచ్చే వరకు ఆమెనే తమిళ బిగ్ బాస్కు హోస్ట్గా వ్యవహరించనుంది.
This post was last modified on November 28, 2021 5:50 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…