టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం టాలీవుడ్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురి చేసింది. ఫిట్స్ తో నాగేశ్వరరావు మరణించారు. తన సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నాగేశ్వరరావును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత మెరుగైన వైైద్యం కోసం మరో రెండు, మూడు ఆసుపత్రులకు తరలించారు. చివరకు ఏలూరు ఆసుపత్రిలో నాగేశ్వరరావును చేర్పించినప్పటికీ పరిస్థితి చేయిదాటిపోయింది. నాగేశ్వరరావు మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయింది. నాగేశ్వరరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి తమ సానుభూతిని తెలుపుతున్నారు. కేఎస్ నాగేశ్వరరావు పార్థివదేహాన్ని ఆయన అత్తగారి ఊరైన నల్లజర్ల సమీపంలోని కౌలూరులో ఉంచారు. ఆ ఊరిలోనే నాగేశ్వరరావు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర నాగేశ్వరరావు అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించారు. ‘రిక్షా రుద్రయ్య’ తో దర్శకుడిగా మారిన నాగేశ్వరరావు….దివంగత శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. తాజాగా తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో కలిసి ఒక సినిమా తీయాన్న యోచనలో ఉన్నారు. ఈ లోపే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
This post was last modified on November 27, 2021 4:45 pm
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…
గత ఏడాది మలయాళంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి…