టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అంత పెద్ద హిట్ అందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలుపెట్టలేదు. మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ సినిమా కోసం పని చేస్తున్నారు త్రివిక్రమ్. ‘భీమ్లా నాయక్’ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారాయన.
ఈ సినిమాకి పని చేస్తున్నందుకు గానూ.. ఆయన రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు.. దీంతో పాటు సినిమా ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుంటారట. ఒక సినిమాకి ఈ రేంజ్ లో పారితోషికం అందుకోవడమంటే మాములు విషయం కాదు. కేవలం మాటలు, స్క్రీన్ ప్లే అనే కాకుండా సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకే నిర్మాతలు ఇంత మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు.
పైగా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తరువాత సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. సినిమాలో రానా మరో హీరోగా కనిపించనున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
This post was last modified on November 26, 2021 2:22 pm
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…