టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అంత పెద్ద హిట్ అందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలుపెట్టలేదు. మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ సినిమా కోసం పని చేస్తున్నారు త్రివిక్రమ్. ‘భీమ్లా నాయక్’ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారాయన.
ఈ సినిమాకి పని చేస్తున్నందుకు గానూ.. ఆయన రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు.. దీంతో పాటు సినిమా ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుంటారట. ఒక సినిమాకి ఈ రేంజ్ లో పారితోషికం అందుకోవడమంటే మాములు విషయం కాదు. కేవలం మాటలు, స్క్రీన్ ప్లే అనే కాకుండా సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకే నిర్మాతలు ఇంత మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు.
పైగా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తరువాత సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. సినిమాలో రానా మరో హీరోగా కనిపించనున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
This post was last modified on November 26, 2021 2:22 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…