Movie News

త్రివిక్రమ్ రెమ్యునరేషన్.. రూ.15కోట్లు+షేర్స్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అంత పెద్ద హిట్ అందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలుపెట్టలేదు. మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ సినిమా కోసం పని చేస్తున్నారు త్రివిక్రమ్. ‘భీమ్లా నాయక్’ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారాయన.

ఈ సినిమాకి పని చేస్తున్నందుకు గానూ.. ఆయన రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు.. దీంతో పాటు సినిమా ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుంటారట. ఒక సినిమాకి ఈ రేంజ్ లో పారితోషికం అందుకోవడమంటే మాములు విషయం కాదు. కేవలం మాటలు, స్క్రీన్ ప్లే అనే కాకుండా సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకే నిర్మాతలు ఇంత మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు.

పైగా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తరువాత సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. సినిమాలో రానా మరో హీరోగా కనిపించనున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Satya

Recent Posts

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

13 minutes ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

3 hours ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

5 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

10 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

12 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

12 hours ago