ఆత్రంగి రే.. హిందీలో క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం. ఇంతకుముందు ధనుష్ను బాలీవుడ్కు పరిచయం చేస్తూ రాన్జానా సినిమా తీసిన ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన సినిమా ఇది. ధనుష్తో పాటు సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మొదలై చాలా తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి హాట్ స్టార్లో ఆత్రంగి రే స్ట్రీమ్ కానుంది.
ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. అది చూస్తే ఆనంద్ తీసి తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాన్జానా సినిమాల్లాగే ఇది కూడా కొంచెం ఎమోషనల్ టచ్ ఉన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్లాగే కనిపిస్తోంది. రాన్జానాతో హిందీ ప్రేక్షకులను కట్టి పడేసిన ధనుష్.. మరోసారి వారి మనసులు కొల్లగొట్టేలాగే కనిపిస్తున్నాడు.
ఆత్రంగి రే.. కథ విషయానికి వస్తే ఒక తమిళ అబ్బాయికి, హిందీ అమ్మాయికి అనుకోకుండా పెళ్లి చేసి పడేస్తారు పెద్దలు. కానీ వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు ఇష్టం ఉండదు. ఇద్దరం విడిపోదాం అనుకుంటారు. కానీ అందుకు కొంత సమయం పడుతుంది. ఈ లోపు అమ్మాయి మీద అబ్బాయికి ప్రేమ పడుతుంది.
అబ్బాయి మీద కూడా అమ్మాయికి పాజిటివ్ ఫీలింగే కలుగుతుంది. కానీ ఈలోపు అమ్మాయికి నచ్చిన వాడు ఆడంబరంగా వస్తాడు. అమ్మాయి అతడితో వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. కానీ ఆమెను ఇష్టపడ్డ అబ్బాయి గిలగిలలాడిపోతాడు. తను వెడ్స్ మను, దాని సీక్వెల్ తరహాలోనే ఇందులోనూ హీరోయిన్ పాత్ర అత్యంత కీలకంగా కనిపిస్తోంది.
సారా ఆ పాత్రలో అదరగొట్టినట్లే ఉంది. ధనుష్ గురించి చెప్పేదేముంది? ట్రైలర్లోనే వావ్ అనిపించాడు. అతిథి పాత్ర లాంటి క్యారెక్టర్లో అక్షయ్ కుమార్ కూడా బాగానే చేసినట్లున్నాడు. మరి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on November 24, 2021 9:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…