తెలుగులో హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రగ్యాజైస్వాల్ కి సరైన సక్సెస్ రాలేదు. ‘కంచె’ తరువాత ఆమె లిస్ట్ లో ఒక్క హిట్టు కూడా లేదు. అయినప్పటికీ ఆమెకి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. ఆయుష్ శర్మ హీరోగా తెరకెక్కిన ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. ఆయుష్ తన చెల్లెలి భర్త కావడంతో సల్మాన్ ఈ సినిమాని నిర్మించడంతో పాటు ఓ పాత్రలో కూడా నటించారు. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా ప్రగ్యాజైస్వాల్ ను తీసుకున్నారు.
దీంతో ప్రగ్యా తెగ సంబరపడిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకి సల్మాన్ ఖాన్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ముందుగా సల్మాన్-ప్రగ్యాజైశ్వాల్ ల మీద కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించారు. అలానే ఓ పాటను కూడా చిత్రీకరించారు. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ లవ్ ట్రాక్ మొత్తాన్ని తీసేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేష్ మంజ్రేకర్, సల్మాన్ ఖాన్.. ఈ రొమాంటిక్ ట్రాక్ లేకపోతే బెటర్ గా ఉంటుందని భావించడంతో ప్రగ్యా జైస్వాల్ సన్నివేశాలన్నీ డిలీట్ చేసేశారట.
ఇప్పుడు సినిమాలో ఆమెకి సంబంధించిన ఒక్క సీన్ కూడా ఉండదని తెలుస్తోంది. ‘అంతిమ్’తో తనకు అవకాశాలు పెరుగుతాయని భావించిన ప్రగ్యాకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కనీసం ఈ సినిమాతోనైనా.. ప్రగ్యాకు బ్రేక్ వస్తుందేమో చూడాలి!
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…