తెలుగులో హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రగ్యాజైస్వాల్ కి సరైన సక్సెస్ రాలేదు. ‘కంచె’ తరువాత ఆమె లిస్ట్ లో ఒక్క హిట్టు కూడా లేదు. అయినప్పటికీ ఆమెకి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. ఆయుష్ శర్మ హీరోగా తెరకెక్కిన ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. ఆయుష్ తన చెల్లెలి భర్త కావడంతో సల్మాన్ ఈ సినిమాని నిర్మించడంతో పాటు ఓ పాత్రలో కూడా నటించారు. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా ప్రగ్యాజైస్వాల్ ను తీసుకున్నారు.
దీంతో ప్రగ్యా తెగ సంబరపడిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకి సల్మాన్ ఖాన్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ముందుగా సల్మాన్-ప్రగ్యాజైశ్వాల్ ల మీద కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించారు. అలానే ఓ పాటను కూడా చిత్రీకరించారు. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ లవ్ ట్రాక్ మొత్తాన్ని తీసేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేష్ మంజ్రేకర్, సల్మాన్ ఖాన్.. ఈ రొమాంటిక్ ట్రాక్ లేకపోతే బెటర్ గా ఉంటుందని భావించడంతో ప్రగ్యా జైస్వాల్ సన్నివేశాలన్నీ డిలీట్ చేసేశారట.
ఇప్పుడు సినిమాలో ఆమెకి సంబంధించిన ఒక్క సీన్ కూడా ఉండదని తెలుస్తోంది. ‘అంతిమ్’తో తనకు అవకాశాలు పెరుగుతాయని భావించిన ప్రగ్యాకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కనీసం ఈ సినిమాతోనైనా.. ప్రగ్యాకు బ్రేక్ వస్తుందేమో చూడాలి!
This post was last modified on November 24, 2021 3:29 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…