తెలుగులో హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రగ్యాజైస్వాల్ కి సరైన సక్సెస్ రాలేదు. ‘కంచె’ తరువాత ఆమె లిస్ట్ లో ఒక్క హిట్టు కూడా లేదు. అయినప్పటికీ ఆమెకి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. ఆయుష్ శర్మ హీరోగా తెరకెక్కిన ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. ఆయుష్ తన చెల్లెలి భర్త కావడంతో సల్మాన్ ఈ సినిమాని నిర్మించడంతో పాటు ఓ పాత్రలో కూడా నటించారు. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా ప్రగ్యాజైస్వాల్ ను తీసుకున్నారు.
దీంతో ప్రగ్యా తెగ సంబరపడిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకి సల్మాన్ ఖాన్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ముందుగా సల్మాన్-ప్రగ్యాజైశ్వాల్ ల మీద కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించారు. అలానే ఓ పాటను కూడా చిత్రీకరించారు. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ లవ్ ట్రాక్ మొత్తాన్ని తీసేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేష్ మంజ్రేకర్, సల్మాన్ ఖాన్.. ఈ రొమాంటిక్ ట్రాక్ లేకపోతే బెటర్ గా ఉంటుందని భావించడంతో ప్రగ్యా జైస్వాల్ సన్నివేశాలన్నీ డిలీట్ చేసేశారట.
ఇప్పుడు సినిమాలో ఆమెకి సంబంధించిన ఒక్క సీన్ కూడా ఉండదని తెలుస్తోంది. ‘అంతిమ్’తో తనకు అవకాశాలు పెరుగుతాయని భావించిన ప్రగ్యాకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కనీసం ఈ సినిమాతోనైనా.. ప్రగ్యాకు బ్రేక్ వస్తుందేమో చూడాలి!
This post was last modified on November 24, 2021 3:29 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…