ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే.. ఫ్యాన్స్ షో అని, ప్రీమియర్స్ అని తెగ హడావిడి ఉంటుంది. అర్ధరాత్రి బెనిఫిట్ షోలు చూడడానికి థియేటర్ల వద్ద ఫ్యాన్స్ క్యూ కడుతుంటారు. కానీ ఈ హంగామాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫుల్ స్టాప్ పెట్టేశాయి. కొంతకాలంగా స్పెషల్ షోలకు, బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఈ షోల కోసం టికెట్ రేట్లు పెంచుకొని అమ్ముకోవడాన్ని ఏపీ ప్రభుత్వం నిరాకరిస్తుంది. మరోపక్క శాంతి భద్రతల పేరుతో తెలంగాణ ప్రభుత్వం కూడా పర్మిషన్స్ ఇవ్వడం మానేసింది.
అయితే బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమాతో మళ్లీ ఫ్యాన్స్ షో హడావిడి మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 1న అర్ధరాత్రి కచ్చితంగా ఫ్యాన్స్ షో వేయించాలని భావిస్తున్నారు. ఏపీ సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్ లో మాత్రం బెనిఫిట్ షో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు ఫ్యాన్స్.
‘అఖండ’ సినిమాతో మళ్లీ స్పెషల్ షోల హంగామా షురూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏరియాలో ఉన్న రెండు థియేటర్లను పర్మిషన్స్ తీసుకొని.. స్పెషల్ షో వేయాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్, ‘పైసా వసూల్’ వంటి సినిమాలకు స్పెషల్ షోలు పడ్డారు. దీంతో ఈసారి కూడా బాలయ్య సినిమాకి స్పెషల్ షో ఉండాల్సిందేనని ఫిక్సయ్యారు.
స్పెషల్ షోలకు పర్మిషన్ దొరక్కపోతే.. ప్రీమియర్ పేరుతోనైనా.. అర్ధరాత్రి షో వేయించేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య సినిమాకి గనుక పర్మిషన్స్ వస్తే.. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పెద్ద సినిమాలకి కూడా ఫ్యాన్స్ షో పర్మిషన్స్ దొరికే ఛాన్స్ ఉంది.
This post was last modified on November 24, 2021 3:17 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…