అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం పనులన్నీ వేగంగా పూర్తి చేస్తోంది. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, మరోపక్క షూటింగ్ ఒకేసారి జరుగుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో సమంతపై ఐటెం సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఇలాంటి సమయంలో చిత్రయూనిట్ కి సడెన్ షాక్ తగిలింది.
దర్శకుడు సుకుమార్ అస్వస్థతకు గురికావడంతో.. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత రెండు నెలలుగా సుకుమార్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ వర్క్స్ అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. విశ్రాంతి లేకుండా పని చేస్తుండడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఇప్పుడు ‘పుష్ప’ పనులకు బ్రేక్ పడింది. ఈ నెలాఖరుకి సుకుమార్ కోలుకొని తిరిగివస్తే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ అందుకుంటాయి.
లేదంటే మాత్రం మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. డిసెంబర్ లో గనుక ‘పుష్ప’ రిలీజ్ అవ్వకపోతే మళ్లీ సమ్మర్ వరకు సరైన డేట్ దొరకడం కష్టం. జనవరి నుంచి మార్చి వరకు వరుసగా పెద్ద సినిమాలు స్లాట్స్ బుక్ చేసుకున్నాయి. వాటితో పోటీ పడే కంటే సినిమాను వాయిదా వేసుకోవడం మంచిది. అందుకే అక్కడవరకు వెళ్లకుండా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. మరిప్పుడు చెప్పిన టైమ్ కి సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి!
This post was last modified on November 24, 2021 3:03 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…