అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం పనులన్నీ వేగంగా పూర్తి చేస్తోంది. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, మరోపక్క షూటింగ్ ఒకేసారి జరుగుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో సమంతపై ఐటెం సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఇలాంటి సమయంలో చిత్రయూనిట్ కి సడెన్ షాక్ తగిలింది.
దర్శకుడు సుకుమార్ అస్వస్థతకు గురికావడంతో.. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత రెండు నెలలుగా సుకుమార్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ వర్క్స్ అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. విశ్రాంతి లేకుండా పని చేస్తుండడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఇప్పుడు ‘పుష్ప’ పనులకు బ్రేక్ పడింది. ఈ నెలాఖరుకి సుకుమార్ కోలుకొని తిరిగివస్తే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ అందుకుంటాయి.
లేదంటే మాత్రం మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. డిసెంబర్ లో గనుక ‘పుష్ప’ రిలీజ్ అవ్వకపోతే మళ్లీ సమ్మర్ వరకు సరైన డేట్ దొరకడం కష్టం. జనవరి నుంచి మార్చి వరకు వరుసగా పెద్ద సినిమాలు స్లాట్స్ బుక్ చేసుకున్నాయి. వాటితో పోటీ పడే కంటే సినిమాను వాయిదా వేసుకోవడం మంచిది. అందుకే అక్కడవరకు వెళ్లకుండా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. మరిప్పుడు చెప్పిన టైమ్ కి సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి!
This post was last modified on November 24, 2021 3:03 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…