Movie News

సుకుమార్ కి అస్వస్థత.. టెన్షన్ లో బన్నీ ఫ్యాన్స్!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం పనులన్నీ వేగంగా పూర్తి చేస్తోంది. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, మరోపక్క షూటింగ్ ఒకేసారి జరుగుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో సమంతపై ఐటెం సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఇలాంటి సమయంలో చిత్రయూనిట్ కి సడెన్ షాక్ తగిలింది.

దర్శకుడు సుకుమార్ అస్వస్థతకు గురికావడంతో.. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత రెండు నెలలుగా సుకుమార్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ వర్క్స్ అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. విశ్రాంతి లేకుండా పని చేస్తుండడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఇప్పుడు ‘పుష్ప’ పనులకు బ్రేక్ పడింది. ఈ నెలాఖరుకి సుకుమార్ కోలుకొని తిరిగివస్తే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ అందుకుంటాయి.

లేదంటే మాత్రం మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. డిసెంబర్ లో గనుక ‘పుష్ప’ రిలీజ్ అవ్వకపోతే మళ్లీ సమ్మర్ వరకు సరైన డేట్ దొరకడం కష్టం. జనవరి నుంచి మార్చి వరకు వరుసగా పెద్ద సినిమాలు స్లాట్స్ బుక్ చేసుకున్నాయి. వాటితో పోటీ పడే కంటే సినిమాను వాయిదా వేసుకోవడం మంచిది. అందుకే అక్కడవరకు వెళ్లకుండా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. మరిప్పుడు చెప్పిన టైమ్ కి సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి!

This post was last modified on November 24, 2021 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

4 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago