పవన్ కళ్యాణ్తో త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. జల్సాతో మొదలైన వీరి ప్రయాణం సినిమాను దాటి ఎక్కడికో వెళ్లిపోయింది. వ్యక్తిగతంగా ఇద్దరూ ఆప్త మిత్రులు అయిపోయారు. ఆ సాన్నిహిత్యంతోనే త్రివిక్రమ్తో మూడు సినిమాలు చేశాడు పవన్. అలాగే పవన్ నటించిన తీన్ మార్ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్టు రాశాడు. గబ్బర్ సింగ్ లాంటి కొన్ని సినిమాలకు కూడా కొంతమేర రచనా సహకారం అందించాడు.
పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ విషయంలోనూ త్రివిక్రమ్ పాత్ర ఉంది. పింక్ సినిమాను పవన్తో రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రాజెక్టును సెట్ చేసింది త్రివిక్రమే. అంతే కాదు.. ఈ సినిమాకు మాటలు కూడా రాయాలని త్రివిక్రమ్ అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదట.
ఈ విషయాన్ని వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను అసలు పవన్తో వకీల్ సాబ్ సినిమా తీస్తానని అనుకోలేదని.. తాను వేరే సినిమా సన్నాహాల్లో ఉండగా నిర్మాత దిల్ రాజుతో కలిసి ఒకసారి త్రివిక్రమ్ను కలిశానని.. అప్పుడు వాళ్లిద్దరూ పింక్ రీమేక్ గురించి మాట్లాడుకున్నారని.. అప్పుడు ఈ సినిమా అవకాశం ఎవరికి దక్కుతుందా అనుకున్నానని.. అనుకోకుండా ఆ అదృష్టం తనకే దక్కిందని వేణు తెలిపాడు.
ముందు ఈ చిత్రానికి మాటలు రాస్తానని త్రివిక్రమ్ అన్నారని.. కానీ ఆయన అల వైకుంఠపురములో పనుల్లో బిజీగా ఉండటం, ఆయన ఖాళీ అవ్వకముందే సినిమాను మొదలుపెట్టాల్సి ఉండటంతో ఈ చిత్రానికి పని చేయలేకపోయారని వేణు తెలిపాడు. పవన్ అభిమాని అయిన తాను.. ఆయన్ని డైరెక్ట్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదని వేణు అన్నాడు.
This post was last modified on June 7, 2020 7:23 am
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…