కొన్ని రోజుల కిందటే ఆర్ఆర్ఆర్కు సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు దర్శకుడు రాజమౌళి. ఆ సందర్భంగా 2022 జనవరి 7న ఆర్ఆర్ఆర్, 6న గంగూబాయి కతియావాడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం గురించి ఓ విలేకరి ప్రశ్నిస్తే.. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో ఇలాంటి పోటీ అనివార్యమని, తన దృష్టిలో పోటీ వల్ల ఎలాంటి సమస్య లేదని.. విషయం ఉంటే రెండు కాదు, ఎన్ని సినిమాలైనా కూడా ఒకేసారి రిలీజై బాగా ఆడతాయని అభిప్రాయపడ్డాడు.
దీన్ని బట్టి తన సినిమా వల్లో మరో చిత్రానికి.. ఇంకో సినిమా వల్ల తన చిత్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది రాజమౌళి అభిప్రాయం అన్నది స్పష్టం. ఐతే మీడియా ముందు అలా చెప్పిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్కు పోటీ లేకుండా చూడటానికి తెర వెనుక గట్టి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ మధ్య జోరుగా వార్తలొస్తున్నాయి.
గంగూబాయి కతియావాడీ సినిమాను ఆర్ఆర్ఆర్కు భయపడి వాయిదా వేయలేదని.. రాజమౌళి విన్నపం మేరకే ఈ సినిమాకు డేట్ మార్చారని బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇప్పుడేమో భీమ్లా నాయక్ మూవీని జనవరి 12 నుంచి తరలించేందుకు రాజమౌళి గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ప్రయత్నం కూడా విఫలమవడంతో ఇప్పుడు రాజమౌళి నేరుగా రంగంలోకి దిగుతున్నాడని, పవన్ కళ్యాణ్ను కలిసి డేట్ మార్చుకునే విషయమై రిక్వెస్ట్ చేయబోతున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే జక్కన్న పైకి చెప్పిన మాటలకు, లోలోన చేస్తున్న పనికి పొంతన లేదు అనుకోవాలి. అంటే వేరే సినిమాలకు జక్కన్న భయపడుతున్నాడని కాదు కానీ.. పోటీ వల్ల థియేటర్లు తగ్గి తమ చిత్రానికి రెవెన్యూ తగ్గుతుందన్నది ఆయన ఆందోళన కావచ్చు.
This post was last modified on November 22, 2021 8:50 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…