కొన్ని రోజుల కిందటే ఆర్ఆర్ఆర్కు సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు దర్శకుడు రాజమౌళి. ఆ సందర్భంగా 2022 జనవరి 7న ఆర్ఆర్ఆర్, 6న గంగూబాయి కతియావాడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం గురించి ఓ విలేకరి ప్రశ్నిస్తే.. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో ఇలాంటి పోటీ అనివార్యమని, తన దృష్టిలో పోటీ వల్ల ఎలాంటి సమస్య లేదని.. విషయం ఉంటే రెండు కాదు, ఎన్ని సినిమాలైనా కూడా ఒకేసారి రిలీజై బాగా ఆడతాయని అభిప్రాయపడ్డాడు.
దీన్ని బట్టి తన సినిమా వల్లో మరో చిత్రానికి.. ఇంకో సినిమా వల్ల తన చిత్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది రాజమౌళి అభిప్రాయం అన్నది స్పష్టం. ఐతే మీడియా ముందు అలా చెప్పిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్కు పోటీ లేకుండా చూడటానికి తెర వెనుక గట్టి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ మధ్య జోరుగా వార్తలొస్తున్నాయి.
గంగూబాయి కతియావాడీ సినిమాను ఆర్ఆర్ఆర్కు భయపడి వాయిదా వేయలేదని.. రాజమౌళి విన్నపం మేరకే ఈ సినిమాకు డేట్ మార్చారని బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇప్పుడేమో భీమ్లా నాయక్ మూవీని జనవరి 12 నుంచి తరలించేందుకు రాజమౌళి గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ప్రయత్నం కూడా విఫలమవడంతో ఇప్పుడు రాజమౌళి నేరుగా రంగంలోకి దిగుతున్నాడని, పవన్ కళ్యాణ్ను కలిసి డేట్ మార్చుకునే విషయమై రిక్వెస్ట్ చేయబోతున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే జక్కన్న పైకి చెప్పిన మాటలకు, లోలోన చేస్తున్న పనికి పొంతన లేదు అనుకోవాలి. అంటే వేరే సినిమాలకు జక్కన్న భయపడుతున్నాడని కాదు కానీ.. పోటీ వల్ల థియేటర్లు తగ్గి తమ చిత్రానికి రెవెన్యూ తగ్గుతుందన్నది ఆయన ఆందోళన కావచ్చు.
This post was last modified on November 22, 2021 8:50 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…