Movie News

ప్రాజెక్ట్ K : మిక్కీ జె మేయర్ ను తప్పించారా..?

నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ K’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తో పది రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ సినిమా కోసం ప్రభాస్ 200 రోజుల డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి ముందుగా మిక్కీ జె మేయర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.

అయితే ఇప్పుడు మిక్కీ స్థానంలో మరో మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ను ప్రభాస్ సినిమా కోసం తీసుకోవాలని అనుకుంటున్నారట. ‘కబాలి’, ‘కాలా’ వంటి సినిమాలకు సంతోష్ మ్యూజిక్ అందించారు.

తమిళంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాల బీజియమ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. నాని నటిస్తోన్న ‘దసరా’ సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కానీ ఇంతలోనే ప్రభాస్ సినిమా ఛాన్స్ వచ్చిందని టాక్.

మిక్కీ జె మేయర్ ను తప్పించి సంతోష్ నారాయణన్ ను తీసుకున్నారా..? లేక కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఆయన్ను తీసుకుంటున్నారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. మరి దీనిపై చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారు.

This post was last modified on November 22, 2021 9:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

45 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago