ఒకే ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది కృతీశెట్టి. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రని ఆమె పండించిన తీరు, ముఖ్యంగా క్లైమాక్స్లో తన నటన ఆడియెన్స్ని కట్టిపడేయడమే కాదు.. ఫిల్మ్ మేకర్స్ ఆమె చుట్టూ తిరిగేలా చేసింది. ఇప్పటికే నాని, నితిన్, సుధీర్ బాబు, రామ్, నాగచైతన్యలతో సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మరో సూపర్బ్ ఆఫర్ ఒకటి పట్టేసినట్లు తెలుస్తోంది.
చిరంజీవి కూతురు సుస్మిత ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ తన బ్యానర్లో ఓ వెబ్ సిరీస్ కూడా తీశారామె. అయితే ఈ నిర్మాణ సంస్థను పెట్టింది కేవలం వెబ్ ప్రాజెక్టుల కోసం మాత్రమే కాదు.. సినిమా తీసే ప్లాన్స్ కూడా సుస్మితకు ఉన్నాయి. ఇప్పటికే ఆ దిశగా వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందట. టీమ్ ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ను తయారు చేసిందని, ఆ చిత్రాన్నే మొదటగా తీయనున్నారని టాక్.
ఈ మూవీ విషయంలో సుస్మిత ఎంతో ఎక్సయిటెడ్గా ఉన్నట్లు చెబుతున్నారు. జీ స్టూడియోస్తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. తెలుగుతో పాటు తమిళంలోనూ తీస్తారట. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో హీరోయిన్ పాత్ర కృతిని వరించినట్లు తెలిసింది. తనైతే ఆ పాత్రకి బాగా సూటవుతుందని, న్యాయం చేస్తుందని సుస్మిత నమ్మడం, కథను కృతికి వినిపిస్తే ఆమె వెంటనే అనడం కూడా జరిగిపోయాయని సమాచారం.
అదే నిజమైతే ఇండస్ట్రీలో కృతి మరో రేంజ్కి వెళ్లిపోవడం ఖాయం. ఎందుకంటే మెగా డాటర్ తీస్తున్న మూవీ. పైగా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ఏ హీరోయిన్కైనా ఇంత త్వరగా తన భుజాలపై సినిమాని మోసే చాన్స్ రావడం కష్టమే. అలాంటిది కృతికి ఆ అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది! తన స్థాయి మరింత పెరిగిపోదూ!
This post was last modified on November 21, 2021 8:31 pm
టాక్సిక్ విడుదల వల్ల చాలా చోట్ల ఇరుముడి థియేటర్లు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. ఇది ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగమే అయినా…
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…