ఒకే ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది కృతీశెట్టి. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రని ఆమె పండించిన తీరు, ముఖ్యంగా క్లైమాక్స్లో తన నటన ఆడియెన్స్ని కట్టిపడేయడమే కాదు.. ఫిల్మ్ మేకర్స్ ఆమె చుట్టూ తిరిగేలా చేసింది. ఇప్పటికే నాని, నితిన్, సుధీర్ బాబు, రామ్, నాగచైతన్యలతో సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మరో సూపర్బ్ ఆఫర్ ఒకటి పట్టేసినట్లు తెలుస్తోంది.
చిరంజీవి కూతురు సుస్మిత ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ తన బ్యానర్లో ఓ వెబ్ సిరీస్ కూడా తీశారామె. అయితే ఈ నిర్మాణ సంస్థను పెట్టింది కేవలం వెబ్ ప్రాజెక్టుల కోసం మాత్రమే కాదు.. సినిమా తీసే ప్లాన్స్ కూడా సుస్మితకు ఉన్నాయి. ఇప్పటికే ఆ దిశగా వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందట. టీమ్ ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ను తయారు చేసిందని, ఆ చిత్రాన్నే మొదటగా తీయనున్నారని టాక్.
ఈ మూవీ విషయంలో సుస్మిత ఎంతో ఎక్సయిటెడ్గా ఉన్నట్లు చెబుతున్నారు. జీ స్టూడియోస్తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. తెలుగుతో పాటు తమిళంలోనూ తీస్తారట. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో హీరోయిన్ పాత్ర కృతిని వరించినట్లు తెలిసింది. తనైతే ఆ పాత్రకి బాగా సూటవుతుందని, న్యాయం చేస్తుందని సుస్మిత నమ్మడం, కథను కృతికి వినిపిస్తే ఆమె వెంటనే అనడం కూడా జరిగిపోయాయని సమాచారం.
అదే నిజమైతే ఇండస్ట్రీలో కృతి మరో రేంజ్కి వెళ్లిపోవడం ఖాయం. ఎందుకంటే మెగా డాటర్ తీస్తున్న మూవీ. పైగా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ఏ హీరోయిన్కైనా ఇంత త్వరగా తన భుజాలపై సినిమాని మోసే చాన్స్ రావడం కష్టమే. అలాంటిది కృతికి ఆ అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది! తన స్థాయి మరింత పెరిగిపోదూ!
This post was last modified on November 21, 2021 8:31 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…