నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. మొదలైన దగ్గర్నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఇటీవల ట్రైలర్ లాంచ్ అయ్యాక అంచనాలు మరింత పెంచేసింది. ఇంకో 12 రోజుల్లోనే ‘అఖండ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాస్త ముందుగానే సినిమాకు సెన్సార్ కూడా పూర్తి చేసేసింది చిత్ర బృందం.
‘అఖండ’కు చిత్ర బృందం అంచనా వేసినట్లే యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. బోయపాటి సినిమాలంటేనే విపరీతమైన హింసతో కూడి ఉంటాయి. కాబట్టి క్లీన్ యు అంటే కష్టమే. ఈ సినిమా రన్ టైం ఎంత అన్న సమాచారం కూడా బయటికి వచ్చేసింది. నిడివి కాస్త ఎక్కువే అని సమాచారం. 2 గంటల 37 నిమిషాలతో ఫైనల్ కట్ రెడీ చేశాడట బోయపాటి.
బాలయ్యతో ఇంతకుముందు బోయపాటి రూపొందించిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్’ సైతం అటు ఇటుగా ఈ నిడివితో రిలీజైన చిత్రాలే. ‘సింహా’ రన్ టైం 2 గంటల 36 నిమిషాలు కాగా.. ‘లెజెండ్’ 2 గంటల 41 నిమిషాల నిడివితో వచ్చింది. సినిమాలో యాక్షన్ ఘట్టాలే దాదాపు 45 నిమిషాలు సాగుతాయన్ని యూనిట్ వర్గాల సమాచారం. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక రోజులు యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు నెలకొల్పినట్లు ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
సినిమాలో యాక్షన్ ఘట్టాలే హైలైట్గా ఉంటాయని ఈ మధ్య రిలీజైన ట్రైలర్ చూసినా అర్థమైపోతుంది. ‘లెజెండ్’ సినిమాను గుర్తుకు తెచ్చేలా ఒక టెంప్లేట్ స్టయిల్లో బోయపాటి ఈ సినిమా తీసినట్లు కనిపిస్తోంది. సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్న అఖండ పాత్ర.. ‘లెజెండ్’లో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ లాగే సినిమా మధ్యలో రంగప్రవేశం చేస్తుందని.. ఆ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి అభిమానులకు గూస్ బంప్పే అని అంటున్నారు.
This post was last modified on November 20, 2021 12:13 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…