రామ్ చరణ్ కెరీర్లో ఎప్పటికీ ‘రంగస్థలం’ ఒక మైలురాయే. అప్పటిదాకా చరణ్ కెరీర్లో బ్లాక్బస్టర్లున్నాయి. హిట్లున్నాయి. కానీ నటుడిగా అతడికి ఏమంత గొప్ప పేరు లేదన్నది వాస్తవం. హావభావాల విషయంలో అతను చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాంటి వాడిలో నటుడిగా కొత్త కోణాల్ని ఆవిష్కరించి న్యూట్రల్ ఆడియన్స్లో ఒక యాక్సెప్టెన్స్ తీసుకొచ్చిన చిత్రం ‘రంగస్థలం.’ అందులో చిట్టిబాబుగా చరణ్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.
చరణ్లో ఇంత మంచి నటుడున్నాడా అనిపించేలా అతడి నుంచి అద్భుత నటనను రాబట్టుకున్న ఘనత సుకుమార్కే చెందుతుంది. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి అలాంటి రా అండ్ రస్టిక్ స్టోరీతో సుక్కు ‘పుష్ప’ తీస్తున్నాడు. చరణ్ను చిట్టిబాబుగా నెవర్ బిఫోర్ క్యారెక్టర్, లుక్స్లో చూపించినట్లే అల్లు అర్జున్ను సైతం పుష్పగా సరికొత్త అవతారంలోకి మార్చాడు సుక్కు.
కాకపోతే ‘పుష్ప’కు సంబంధించిన ప్రోమోలు చూసినపుడల్లా సుకుమార్, అల్లు అర్జున్ ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ‘రంగస్థలం’ను ప్రతి విషయంలోనూ అనుకరిస్తూ.. ఇందులో డోస్ పెంచేస్తున్నారు. బన్నీ లుక్స్, మేనరిజమ్స్ విషయంలో మరీ శ్రుతి మించిపోయినట్లుగా అనిపిస్తోంది ప్రోమోలు చూస్తుంటే. ‘దాక్కో దాక్కో మేక’తో పాటు తాజాగా రిలీజ్ చేసిన ‘ఏయ్ బిడ్డా’ పాటల్లో బన్నీ హావభావాలు.. స్టెప్స్ విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
చరణ్ చేసిన చిట్టిబాబు పాత్రలో ఉన్న సహజత్వం.. పుష్పగా అల్లు అర్జున్లో కనిపించడం లేదు. చిట్టిబాబును మించిపోవాలి అనే తాపత్రయంలో పుష్ప లుక్స్.. మేనరిజంల విషయంలో బన్నీ మరీ అతి చేసినట్లుగా అనిపిస్తోంది. అతడి పాత్రను చూస్తుంటే తమిళ సినిమాల్లో హీరోలను గుర్తుకు తెస్తున్నాయి. ‘రంగస్థలం’ ఇరగాడేసింది కదా.. చిట్టిబాబు పాత్ర అంతగా నచ్చేసింది కదా అని ‘పుష్ప’ సినిమా, లీడ్ రోల్ విషయంలో సుక్కు-బన్నీ ఓవర్ ద టాప్ వెళ్లిపోయిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి రేప్పొద్దున సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on November 19, 2021 10:05 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…