ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమవుతోంది. చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఇలా చాలా మంది హీరోల విషయంలో దర్శకులు ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరేమో సీనియర్ హీరో సినిమా అంటే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య సరసన నటించడానికి శృతిహాసన్ ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. ఓ పక్క ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తూనే.. బాలయ్య సినిమాకి శృతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా శృతి హాజరైంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. దర్శకుడితో ఉన్న స్నేహం కారణంగానే శృతి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది. అయితే కొన్ని కండీషన్స్ కూడా పెట్టిందట శృతి. అవేంటంటే.. ఈ సినిమా కోసం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ అడిగింది. దానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. అలానే సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించనని చెప్పిందట.
డాన్స్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని.. కానీ ఎక్కువ హగ్గింగ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ పెట్టొద్దని దర్శకనిర్మాతలకు సూచించిందట. తన పాత్రను గౌరవప్రదంగా చూపించాలని.. గ్లామర్ షోకి ప్రాధాన్యత ఇవ్వొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. శృతి పెట్టిన ఈ షరతులన్నింటికీ గోపీచంద్ మలినేని అంగీకరించినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలకానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on November 19, 2021 12:41 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…