ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమవుతోంది. చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఇలా చాలా మంది హీరోల విషయంలో దర్శకులు ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరేమో సీనియర్ హీరో సినిమా అంటే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య సరసన నటించడానికి శృతిహాసన్ ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. ఓ పక్క ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తూనే.. బాలయ్య సినిమాకి శృతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా శృతి హాజరైంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. దర్శకుడితో ఉన్న స్నేహం కారణంగానే శృతి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది. అయితే కొన్ని కండీషన్స్ కూడా పెట్టిందట శృతి. అవేంటంటే.. ఈ సినిమా కోసం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ అడిగింది. దానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. అలానే సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించనని చెప్పిందట.
డాన్స్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని.. కానీ ఎక్కువ హగ్గింగ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ పెట్టొద్దని దర్శకనిర్మాతలకు సూచించిందట. తన పాత్రను గౌరవప్రదంగా చూపించాలని.. గ్లామర్ షోకి ప్రాధాన్యత ఇవ్వొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. శృతి పెట్టిన ఈ షరతులన్నింటికీ గోపీచంద్ మలినేని అంగీకరించినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలకానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on November 19, 2021 12:41 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…