ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమవుతోంది. చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఇలా చాలా మంది హీరోల విషయంలో దర్శకులు ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరేమో సీనియర్ హీరో సినిమా అంటే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య సరసన నటించడానికి శృతిహాసన్ ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. ఓ పక్క ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తూనే.. బాలయ్య సినిమాకి శృతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా శృతి హాజరైంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. దర్శకుడితో ఉన్న స్నేహం కారణంగానే శృతి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది. అయితే కొన్ని కండీషన్స్ కూడా పెట్టిందట శృతి. అవేంటంటే.. ఈ సినిమా కోసం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ అడిగింది. దానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. అలానే సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించనని చెప్పిందట.
డాన్స్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని.. కానీ ఎక్కువ హగ్గింగ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ పెట్టొద్దని దర్శకనిర్మాతలకు సూచించిందట. తన పాత్రను గౌరవప్రదంగా చూపించాలని.. గ్లామర్ షోకి ప్రాధాన్యత ఇవ్వొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. శృతి పెట్టిన ఈ షరతులన్నింటికీ గోపీచంద్ మలినేని అంగీకరించినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలకానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on November 19, 2021 12:41 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…