ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమవుతోంది. చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఇలా చాలా మంది హీరోల విషయంలో దర్శకులు ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరేమో సీనియర్ హీరో సినిమా అంటే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య సరసన నటించడానికి శృతిహాసన్ ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. ఓ పక్క ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తూనే.. బాలయ్య సినిమాకి శృతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా శృతి హాజరైంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. దర్శకుడితో ఉన్న స్నేహం కారణంగానే శృతి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది. అయితే కొన్ని కండీషన్స్ కూడా పెట్టిందట శృతి. అవేంటంటే.. ఈ సినిమా కోసం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ అడిగింది. దానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. అలానే సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించనని చెప్పిందట.
డాన్స్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని.. కానీ ఎక్కువ హగ్గింగ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ పెట్టొద్దని దర్శకనిర్మాతలకు సూచించిందట. తన పాత్రను గౌరవప్రదంగా చూపించాలని.. గ్లామర్ షోకి ప్రాధాన్యత ఇవ్వొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. శృతి పెట్టిన ఈ షరతులన్నింటికీ గోపీచంద్ మలినేని అంగీకరించినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలకానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on November 19, 2021 12:41 pm
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…