మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి అత్యధికంగా చర్చ జరిగింది ఒకే ఒక్క విషయం మీద. చిరు చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తారు అని. గ్యాంగ్స్టర్ అయిన హీరోకి, అతణ్ని అసహ్యించుకునే చెల్లెలికి మధ్య జరిగే సీన్సే ఈ సినిమాకి హైలైట్. చివరికి ఆ చెల్లెలు అన్నని సాయం కోరే సీన్ సినిమాకే ప్రాణం. అందుకే ‘గాడ్ఫాదర్’లో ఆ రోల్ ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకి ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే గాడ్ఫాదర్కి చెల్లెలిగా నయనతార ఫిక్సయ్యింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని టీమ్ కన్ఫర్మ్ చేసింది. అయితే చెల్లెలి క్యారెక్టర్ అని చెప్పకుండా తమ చిత్రంలో నయన్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని మాత్రమే చెప్పారు. ఈ సినిమాలో కీలకమైన లేడీ క్యారెక్టర్ అంటే కచ్చితంగా అది మంజు వారియర్ పోషించిన పాత్రే.
‘సైరా’లో చిరుకి జోడీగా నటించిన నయనతారని ఆయన చెల్లెలి పాత్రలో చూడటం ఫ్యాన్స్కి అంతగా నచ్చకపోవచ్చు. నిజానికి ఎవరూ ఫీలవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్లిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లే అయినా కథానుసారం ఎక్కడా ఆ రిలేషన్ని కన్ఫర్మ్ చేయరు. అన్నా చెల్లీ అనే పిలుపులు కూడా ఉండవు. కాబట్టి తెరపై ఇద్దరినీ చూస్తే బలమైన పాత్రల్లా అనిపిస్తారే తప్ప అన్నాచెల్లెళ్లు అనే ఫీలింగ్ కలగదు. బహుశా నయన్ని తీసుకునేముందు ఈ యాంగిల్లో కూడా ఆలోచించే ఉంటారు మేకర్స్.
ఏదేమైనా కానీ ఈ క్యారెక్టర్కి నయన్ పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పాత్ర చాలా హుందాగా ఉంటుంది. సీరియస్గా ఉంటుంది. డేరింగా డ్యాషింగ్గా కనిపిస్తుంది. సటిల్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇంటెలిజెన్స్, ఇండివిడ్యువాలిటీ ఉన్న మహిళ తను. అందుకే మలయాళంలో మంజు వారియర్ లాంటి స్టార్ హీరోయిన్ని తీసుకున్నారు. కాబట్టి తెలుగులో కూడా నయన్ లాంటి స్టార్ హీరోయిన్ చేయడమే కరెక్ట్. అయితే తన పాత్ర హీరో పాత్రకి తీసిపోనట్టుగా ఉంటేనే నయన్ ఎస్ అంటుంది. కాబట్టి పాత్ర నిడివిని పెంచే చాన్స్ ఉంది. ఏదేమైనా ఇన్నాళ్లకి గాడ్ ఫాదర్కి చెల్లెలి సమస్య తీరిపోయింది.
This post was last modified on November 18, 2021 10:59 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…