Movie News

సూర్య చేసిన ఒకే ఒక తప్పు

‘జై భీమ్’ సినిమాతో సూర్య మీద ఏ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయో తెలిసిందే. ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 90వ దశకంలో జరిగిన ఒక దారుణమైన లాకప్‌డెత్ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. సూర్య ఇందులో చంద్రు అనే ప్రధాన పాత్రను పోషించడంతో పాటు తన 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించాడు. జ్ఞానవేల్ అనే యువ దర్శకుడు ‘జై భీమ్’ను రూపొందించాడు.

ఇలాంటి సినిమాకు నటుడిగా, నిర్మాతగా అండగా నిలవడం పట్ల సూర్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐతే ఈ సినిమా విషయంలో కొన్ని వివాదాలు సూర్యను చుట్టుముట్టడం తెలిసిందే. వన్నియార్ అనే కులాన్ని కించపరిచేలా ఓ సన్నివేశం ఉందని ఆ కులస్థులు సూర్యను వివాదంలోకి లాగడమే కాక.. క్షమాపణ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సూర్యకు అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది. ఇందులో సూర్య తప్పేమీ లేదని అందరూ వాదించారు. పైగా సూర్య ఆ సన్నివేశాన్ని సినిమా నుంచి తీయించడంతో అతడికి మరింత మద్దతు లభించింది.

ఐతే ఈ విషయంలో సూర్య తప్పు లేదనిపించినా.. మరో విషయంలో మాత్రం అతడికి విమర్శలు తప్పట్లేదు. లాకప్ డెత్ కేసుకు సంబంధించి తమిళంలో చాలా వరకు నిజ జీవిత పాత్రల పేర్లనే సినిమాలోనూ పెట్టారు. చంద్రు అని లాయర్‌గా, జడ్జిగా బాగా పాపులర్ అయిన వ్యక్తి పాత్రనే సూర్య చేశాడు. అదే పేరును కొనసాగించారు. అలాగే లాకప్ డెత్ బాధితుడిగా రాజా కన్ను, అతడి భార్యగా సెంగిని పేర్లను కూడా సినిమాలో కొనసాగించారు. కానీ రాజా కన్నుతో పాటు మరో ఇద్దరి పట్ల కిరాతకంగా వ్యవహరించి ఈ లాకప్ డెత్‌కు కారణమైన వ్యక్తి పేరును మాత్రం సూర్య టీం మార్చేసింది.

ఒరిజినల్‌గా ఆ వ్యక్తి ఆంటోనీ స్వామి అనే క్రిస్టియన్ కాగా.. సినిమాలో మాత్రం ‘గురుమూర్తి’ అనే హిందువు పేరు పెట్టారు. మిగతా పాత్రలను యథాతథంగా కొనసాగించి.. క్రిస్టియన్ పేరును మాత్రం హిందూ పేరుగా మార్చడంలో సూర్య అండ్ కో ఉద్దేశం ఏంటి అంటూ హిందూ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సూర్య సమర్థించుకోవడానికి కూడా ఏమీ లేకపోవడంతో సైలెంటుగా ఉన్నాడు.

This post was last modified on November 18, 2021 10:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

1 hour ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

2 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

3 hours ago