తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తూ తనే స్వయంగా నిర్మించిన చిత్రం జై భీమ్. దీపావళి ముంగిట ఈ సినిమా అమేజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజవడం.. అద్భుత స్పందన తెచ్చుకోవడం తెలిసిందే. సూర్య కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా.. సమాజానికి చాలా అవసరమైన సినిమాగా దీనిపై ప్రశంసల జల్లు కురిసింది.
ఇంత గొప్ప సినిమాకు సైతం వివాదాలు తప్పలేదు. సినిమాలో ఒక చోట చూపించిన ఓ పోస్టర్ వన్నియార్ కులస్థులను కించపరిచేలా ఉందంటూ ఆ వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సూర్య క్షమాపణ చెప్పాలని.. సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఐతే సినిమాలో ఆ పోస్టర్ కనిపించకుండా తీసేశారు. తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. ఇలాంటి వాటితో పబ్లిసిటీ చేసుకునే అలవాటు తనకు లేదని సూర్య వివరణ కూడా ఇచ్చాడు.
అయినా సరే.. వన్నియార్ కుల సంఘం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ వెనక్కి తగ్గలేదు. సూర్య తమకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో సూర్యకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులంతా రంగంలోకి దిగారు. వెట్రిమారన్, సిద్దార్థ్, లోకేష్ కనకరాజ్, అమీర్.. ఇలా ఒక్కొక్కరుగా సూర్యకు మద్దతుగా ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. westandwithsuriya అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడికి మద్దతుగా నిలిచారు.
ఎంతో గొప్ప సంకల్పంతో జై భీమ్ సినిమా తీశారని.. ఇలాంటి సినిమాను వివాదాల్లోకి లాగడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సూర్య సదరు పోస్టర్ను సినిమా నుంచి తొలగించాక కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం పట్ల అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై దక్షిణాది చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ కూడా స్పందించారు. సూర్య క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…