హీరో సెట్టయ్యాడు. దర్శకుడూ సెట్టయ్యాడు. సంగీత దర్శకుడి దగ్గర నుంచి అందరూ సెట్టయ్యారు. సినిమా సెట్స్కి కూడా వెళ్లిపోయింది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయినా హీరో చెల్లెలి పాత్రకి మాత్రం నటి సెట్ కావట్లా. వినడానికి కాస్త విడ్డూరంగానే ఉన్నా ‘గాడ్ ఫాదర్’ విషయంలో ఇదే జరుగుతోంది.
మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ ఈ సినిమా. మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చేశాడు మోహన్ రాజా. ఆ మార్చే క్రమంలో కొత్త క్యారెక్టర్లను ఈజీగా యాడ్ చేశాడు కానీ, ఉన్న క్యారెక్టర్లను తీసేసే చాన్స్ మాత్రం లేదు. ఎందుకంటే ఈ మూవీ మొత్తం క్యారెక్టర్ల మీదే బేస్ అయ్యి ఉంటుంది. ముఖ్యంగా చెల్లెలి పాత్ర. అదే కథకి ఆయువుపట్టు. ఒరిజినల్లో మంజు వారియర్ అద్భుతంగా పోషించిన ఆ పాత్రకి తెలుగులో ఇంతవరకు నటి ఫిక్స్ కాలేదు.
హీరోని అసహ్యించుకునే చెల్లెలు, ఆ తర్వాత తన అన్న ఎంత గొప్పవాడో తెలుసుకుంటుంది. అతని సహాయం కోరుతుంది. ఆమె కోసం ఆ అన్న పెద్ద యుద్ధాన్నే చేస్తాడు. అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కనుక నయనతారను అడిగారని, ఆమె నో అందని అన్నారు. ఆ తర్వాత సుహాసిని, విద్యాబాలన్ లాంటి పేర్లు చాలానే వినిపించాయి. చివరికి ఆ లిస్టు రమ్యకృష్ణ దగ్గరకు వచ్చి ఆగింది. శివగామిగా అదరగొట్టిన ఆమె అయితేనే హుందాగా ఉండే ఈ పాత్రకి పర్ఫెక్ట్ అని టీమ్ ఫీలవుతోందట. ఆమెనే తీసుకోబోతున్నారని లేటెస్ట్ టాక్.
అయితే ఇప్పటికే ఇలాంటి పేర్లు చాలా వినిపించాయి కాబట్టి ఇది కూడా నమ్మడం కష్టమే. అయినా ఒరిజినల్లో లేని హీరోయిన్ పాత్రని తెలుగులో సృష్టించి, దానికి అనుష్కని కూడా సెలెక్ట్ చేసుకున్నారని అంటున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన చిన్న రోల్కి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోని సెట్ చేశారు. చిరు, సల్మాన్ కలిసి డ్యాన్స్ చేసే సిచ్యుయేషన్ని సృష్టించి, ఆ పాటను వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్తో పాడిస్తున్నారు. ఇన్ని చేయగలిగిన దర్శక నిర్మాతలు చెల్లెలి గండాన్ని మాత్రం దాటలేకపోతున్నారేంటో మరి!
This post was last modified on November 16, 2021 11:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…