హీరో సెట్టయ్యాడు. దర్శకుడూ సెట్టయ్యాడు. సంగీత దర్శకుడి దగ్గర నుంచి అందరూ సెట్టయ్యారు. సినిమా సెట్స్కి కూడా వెళ్లిపోయింది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయినా హీరో చెల్లెలి పాత్రకి మాత్రం నటి సెట్ కావట్లా. వినడానికి కాస్త విడ్డూరంగానే ఉన్నా ‘గాడ్ ఫాదర్’ విషయంలో ఇదే జరుగుతోంది.
మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ ఈ సినిమా. మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చేశాడు మోహన్ రాజా. ఆ మార్చే క్రమంలో కొత్త క్యారెక్టర్లను ఈజీగా యాడ్ చేశాడు కానీ, ఉన్న క్యారెక్టర్లను తీసేసే చాన్స్ మాత్రం లేదు. ఎందుకంటే ఈ మూవీ మొత్తం క్యారెక్టర్ల మీదే బేస్ అయ్యి ఉంటుంది. ముఖ్యంగా చెల్లెలి పాత్ర. అదే కథకి ఆయువుపట్టు. ఒరిజినల్లో మంజు వారియర్ అద్భుతంగా పోషించిన ఆ పాత్రకి తెలుగులో ఇంతవరకు నటి ఫిక్స్ కాలేదు.
హీరోని అసహ్యించుకునే చెల్లెలు, ఆ తర్వాత తన అన్న ఎంత గొప్పవాడో తెలుసుకుంటుంది. అతని సహాయం కోరుతుంది. ఆమె కోసం ఆ అన్న పెద్ద యుద్ధాన్నే చేస్తాడు. అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కనుక నయనతారను అడిగారని, ఆమె నో అందని అన్నారు. ఆ తర్వాత సుహాసిని, విద్యాబాలన్ లాంటి పేర్లు చాలానే వినిపించాయి. చివరికి ఆ లిస్టు రమ్యకృష్ణ దగ్గరకు వచ్చి ఆగింది. శివగామిగా అదరగొట్టిన ఆమె అయితేనే హుందాగా ఉండే ఈ పాత్రకి పర్ఫెక్ట్ అని టీమ్ ఫీలవుతోందట. ఆమెనే తీసుకోబోతున్నారని లేటెస్ట్ టాక్.
అయితే ఇప్పటికే ఇలాంటి పేర్లు చాలా వినిపించాయి కాబట్టి ఇది కూడా నమ్మడం కష్టమే. అయినా ఒరిజినల్లో లేని హీరోయిన్ పాత్రని తెలుగులో సృష్టించి, దానికి అనుష్కని కూడా సెలెక్ట్ చేసుకున్నారని అంటున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన చిన్న రోల్కి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోని సెట్ చేశారు. చిరు, సల్మాన్ కలిసి డ్యాన్స్ చేసే సిచ్యుయేషన్ని సృష్టించి, ఆ పాటను వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్తో పాడిస్తున్నారు. ఇన్ని చేయగలిగిన దర్శక నిర్మాతలు చెల్లెలి గండాన్ని మాత్రం దాటలేకపోతున్నారేంటో మరి!
This post was last modified on November 16, 2021 11:04 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…