ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా హీరోగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా టీజర్, పాట విడుదలైనప్పుడు మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమాలో రానా నక్సలైట్ రోల్ అనేసరికి ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. సాయి పల్లవిని హీరోయిన్ నటించడంతో కచ్చితంగా సినిమాలో కొత్తదనం ఉంటుందని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గుతోంది. షూటింగ్ పూర్తయినా.. కరోనా కారణంగా సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నాయి.. ఇంకా సినిమాను రిలీజ్ చేయడం లేదు. నిర్మాత సురేష్ బాబు ‘విరాటపర్వం’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలా..? లేక థియేటర్లో విడుదల చేయాలా..? అనే విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఓటీటీలో రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ల నుంచి విమర్శలు వస్తాయని ఆలోచిస్తున్నారు. అందుకే ‘భీమ్లా నాయక్’ రిలీజైన తరువాత ‘విరాటపర్వం’ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు.
ప్రస్తుతానికైతే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి వస్తుందని అంటున్నారు. లేదంటే మార్చి లేదా ఏప్రిల్ కి వాయిదా పడే ఛాన్స్ ఉంది. ‘సంక్రాంతికే సినిమా వస్తే రానాకి హెల్ప్ అవుతుంది. అప్పుడు ‘విరాటపర్వం’ సినిమాను థియేటర్లో విడుదల చేసుకుంటారు. లేదంటే ఓటీటీ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా రిలీజ్ బాగా ఆలస్యమైంది. ఇంకా లేట్ చేస్తే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లే ఛాన్స్ ఉంది.
This post was last modified on November 16, 2021 9:29 am
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…
మలయాళంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు వాలా 2. అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది రెండు వందల కోట్ల…