ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా హీరోగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా టీజర్, పాట విడుదలైనప్పుడు మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమాలో రానా నక్సలైట్ రోల్ అనేసరికి ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. సాయి పల్లవిని హీరోయిన్ నటించడంతో కచ్చితంగా సినిమాలో కొత్తదనం ఉంటుందని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గుతోంది. షూటింగ్ పూర్తయినా.. కరోనా కారణంగా సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నాయి.. ఇంకా సినిమాను రిలీజ్ చేయడం లేదు. నిర్మాత సురేష్ బాబు ‘విరాటపర్వం’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలా..? లేక థియేటర్లో విడుదల చేయాలా..? అనే విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఓటీటీలో రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ల నుంచి విమర్శలు వస్తాయని ఆలోచిస్తున్నారు. అందుకే ‘భీమ్లా నాయక్’ రిలీజైన తరువాత ‘విరాటపర్వం’ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు.
ప్రస్తుతానికైతే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి వస్తుందని అంటున్నారు. లేదంటే మార్చి లేదా ఏప్రిల్ కి వాయిదా పడే ఛాన్స్ ఉంది. ‘సంక్రాంతికే సినిమా వస్తే రానాకి హెల్ప్ అవుతుంది. అప్పుడు ‘విరాటపర్వం’ సినిమాను థియేటర్లో విడుదల చేసుకుంటారు. లేదంటే ఓటీటీ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా రిలీజ్ బాగా ఆలస్యమైంది. ఇంకా లేట్ చేస్తే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లే ఛాన్స్ ఉంది.
This post was last modified on November 16, 2021 9:29 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…