సమంత సినీ, వ్యక్తిగత జీవితం మీద ఇప్పుడు అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నాగచైతన్య నుంచి ఆమె విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ మధ్యే ఆ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ సమంత అభిమానులను చాలా బాధ పెట్టింది. వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నతో అందరూ సమంత వైపు చూస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురు దెబ్బకు.. సినిమాలతోనే మందు రాయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వివిధ భాషల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ను పొడిగించుకోవడానికి ఆమె డిసైడైపోయింది.
ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. చైతూ నుంచి విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నాక ఆమె చేసిన తొలి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైపోవడం గమనార్హం. అది ఓ తమిళ చిత్రం. దాని పేరు.. కాతువాకుల రెండు కాదల్.
నయనతార కాబోయే భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సమంతతో పాటు నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించడం విశేషం. ఈ వెరైటీ కాంబినేషన్లో సినిమా అనేసరికి ముందు నుంచి ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూట్ టైంలో లీక్ అయిన ఒక సన్నివేశం క్యూరియాసిటీని పెంచింది. సేతుపతి, సమంత, నయన కలిసి ఒక ఆర్టీసీ బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న దృశ్యమది. ఇదొక వెరైటీ లవ్ స్టోరీ అని, విఘ్నేష్ శివన్ స్టయిల్లో ఫన్నీగా ఉంటుందని అంటున్నారు.
ఈ చిత్రంలో సామ్ ఖటీజా అనే వెరైటీ క్యారెక్టర్ చేస్తోంది. తన ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుందని కూడా ప్రకటించారు. కొన్ని నెలల నుంచి సమంత వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడుకుంటున్న జనాలు ఇక ఆమె సినిమా గురించి మాట్లాడుకునే టైం వచ్చేసింది. చైతూ నుంచి విడిపోయాక సామ్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడం కూడా దీనిపై ఆసక్తిని పెంచేదే.
This post was last modified on November 16, 2021 8:40 am
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…