Movie News

సమంత కొత్త సినిమా వచ్చేస్తోందహో..

సమంత సినీ, వ్యక్తిగత జీవితం మీద ఇప్పుడు అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నాగచైతన్య నుంచి ఆమె విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ మధ్యే ఆ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ సమంత అభిమానులను చాలా బాధ పెట్టింది. వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నతో అందరూ సమంత వైపు చూస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురు దెబ్బకు.. సినిమాలతోనే మందు రాయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వివిధ భాషల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ కెరీర్‌ను పొడిగించుకోవడానికి ఆమె డిసైడైపోయింది.

ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. చైతూ నుంచి విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నాక ఆమె చేసిన తొలి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైపోవడం గమనార్హం. అది ఓ తమిళ చిత్రం. దాని పేరు.. కాతువాకుల రెండు కాదల్.

నయనతార కాబోయే భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సమంతతో పాటు నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించడం విశేషం. ఈ వెరైటీ కాంబినేషన్లో సినిమా అనేసరికి ముందు నుంచి ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూట్ టైంలో లీక్ అయిన ఒక సన్నివేశం క్యూరియాసిటీని పెంచింది. సేతుపతి, సమంత, నయన కలిసి ఒక ఆర్టీసీ బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న దృశ్యమది. ఇదొక వెరైటీ లవ్ స్టోరీ అని, విఘ్నేష్ శివన్ స్టయిల్లో ఫన్నీగా ఉంటుందని అంటున్నారు.

ఈ చిత్రంలో సామ్ ఖటీజా అనే వెరైటీ క్యారెక్టర్ చేస్తోంది. తన ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుందని కూడా ప్రకటించారు. కొన్ని నెలల నుంచి సమంత వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడుకుంటున్న జనాలు ఇక ఆమె సినిమా గురించి మాట్లాడుకునే టైం వచ్చేసింది. చైతూ నుంచి విడిపోయాక సామ్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడం కూడా దీనిపై ఆసక్తిని పెంచేదే.

This post was last modified on November 16, 2021 8:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

8 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

9 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

12 hours ago