స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. 2019 డిసెంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టారు. అంటే దాదాపు రెండేళ్లు అయిపోయింది.
రెండు లాక్ డౌన్స్ వచ్చినప్పటికీ.. సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. ఫైనల్ గా 2022, జనవరి 6న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ అదే సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. అందులో కూడా అలియానే హీరోయిన్ గా నటించింది.
దీంతో రాజమౌళి రంగంలోకి దిగి దర్శకుడు భన్సాలీని, నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ను ‘గంగూబాయి’ సినిమాను వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. దీనిపై పలు చర్చలు జరిగిన అనంతరం పెన్ స్టూడియోస్ సంస్థ తమ సినిమాను వాయిదా వేయడానికి అంగీకరించింది.
తాజాగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2022, ఫిబ్రవరి 18న ‘గంగూబాయి కథియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను బాలీవుడ్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ చేసుకోవచ్చు.
తన రిక్వెస్ట్ ను కన్సిడర్ చేయడంతో రాజమౌళి ట్విట్టర్ వేదికగా ‘గంగూబాయి’ దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
This post was last modified on November 15, 2021 4:38 pm
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…