స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. 2019 డిసెంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టారు. అంటే దాదాపు రెండేళ్లు అయిపోయింది.
రెండు లాక్ డౌన్స్ వచ్చినప్పటికీ.. సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. ఫైనల్ గా 2022, జనవరి 6న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ అదే సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. అందులో కూడా అలియానే హీరోయిన్ గా నటించింది.
దీంతో రాజమౌళి రంగంలోకి దిగి దర్శకుడు భన్సాలీని, నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ను ‘గంగూబాయి’ సినిమాను వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. దీనిపై పలు చర్చలు జరిగిన అనంతరం పెన్ స్టూడియోస్ సంస్థ తమ సినిమాను వాయిదా వేయడానికి అంగీకరించింది.
తాజాగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2022, ఫిబ్రవరి 18న ‘గంగూబాయి కథియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను బాలీవుడ్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ చేసుకోవచ్చు.
తన రిక్వెస్ట్ ను కన్సిడర్ చేయడంతో రాజమౌళి ట్విట్టర్ వేదికగా ‘గంగూబాయి’ దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
This post was last modified on November 15, 2021 4:38 pm
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…