Movie News

రాజమౌళి కోసం వెనక్కి తగ్గిన అలియా!

స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. 2019 డిసెంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టారు. అంటే దాదాపు రెండేళ్లు అయిపోయింది.

రెండు లాక్ డౌన్స్ వచ్చినప్పటికీ.. సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. ఫైనల్ గా 2022, జనవరి 6న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ అదే సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. అందులో కూడా అలియానే హీరోయిన్ గా నటించింది.

దీంతో రాజమౌళి రంగంలోకి దిగి దర్శకుడు భన్సాలీని, నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ను ‘గంగూబాయి’ సినిమాను వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. దీనిపై పలు చర్చలు జరిగిన అనంతరం పెన్ స్టూడియోస్ సంస్థ తమ సినిమాను వాయిదా వేయడానికి అంగీకరించింది.

తాజాగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2022, ఫిబ్రవరి 18న ‘గంగూబాయి కథియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను బాలీవుడ్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ చేసుకోవచ్చు.

తన రిక్వెస్ట్ ను కన్సిడర్ చేయడంతో రాజమౌళి ట్విట్టర్ వేదికగా ‘గంగూబాయి’ దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

This post was last modified on November 15, 2021 4:38 pm

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

2 hours ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

2 hours ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

5 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

5 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

5 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

8 hours ago