వేరే సినిమాలు సెట్స్ మీదికి వెళ్లిన కొన్ని రోజుల నుంచే ఆ సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేస్తూ ప్రమోషన్లు చేసుకుంటుంటే.. రెండేళ్ల ముందు పట్టాలెక్కిన ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ నుంచి ఇప్పటిదాకా ఒక్క పాట కూడా రిలీజ్ కాకపోవడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’కు సంగీత దర్శకుల విషయంలో విపరీతమైన గందరగోళం నెలకొని రిలీజ్కు కొన్ని నెలల ముందు వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లతో పాటలు చేయించుకుని హడావుడి పడటం వల్ల సినిమాకు నష్టం జరగడం తెలిసిందే.
‘రాధేశ్యామ్’ మ్యూజిక్ విషయంలోనూ ఇలాంటి గందరగోళమే నడిచింది. చివరికి సౌత్ వెర్షన్లకు ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ను.. హిందీ వెర్షన్కు వేరే మ్యూజిక్ డైరెక్టర్ను ఖరారు చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతలేమో ఇంకొకరికి అప్పగించారు. ఐతే ఏ వెర్షన్కు సంబంధించి కూడా ఇప్పటిదాకా సాంగ్స్ అప్డేట్స్ మాత్రం లేవు.
విడుదలకు ఇంకో రెండు నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ఇప్పుడైనా కదలరా అని అభిమానులు సోషల్ మీడియాలో గొడవ గొడవ చేస్తే ఎట్టకేలకు ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 15న ‘రాధేశ్యామ్’ నుంచి తొలి పాట విడుదల కాబోతోంది. ఐతే ఈ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కొత్త సందేహాలకు తెరతీస్తోంది. ఫస్ట్ సింగిల్ అప్డేట్ పోస్టర్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలు మాత్రమే పేర్కొన్నారు. హిందీ గురించి ప్రస్తావన లేదు.
ఇప్పుడు రిలీజ్ చేస్తున్న పాట దక్షిణాది భాషలకే పరిమితమా.. హిందీలో ఉండదా అన్న డౌట్ ముందు వస్తోంది. ఇలా పాటల విషయంలో తేడాలెలా ఉంటాయి అనిపిస్తోంది. ఐతే అదే సమయంలో ‘రాధేశ్యామ్’ హిందీ రిలీజ్ విషయంలో ఏమైనా సమస్యలున్నాయా.. సంక్రాంతికి దక్షిణాది భాషల్లో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తారా.. హిందీ వెర్షన్ ఏమైనా ఆలస్యమవుతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న అభిమానులకు మేకర్స్ నుంచి త్వరగా క్లారిటీ వస్తే బెటర్.
This post was last modified on November 14, 2021 7:59 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…