Movie News

‘జబర్దస్త్’ షోను వదిలేస్తున్నాడా..?

బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది ‘జబర్దస్త్’. దీనికి పోటీగా ఎన్ని షోలు వస్తున్నా.. బీట్ చేయలేకపోతున్నాను. ఈ షో చాలా మంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. పదుల సంఖ్యలో కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొంతమందికి సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చింది. దాదాపు తొమ్మిదేళ్లుగా ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మునుపటితో పోలిస్తే.. ఈ మధ్యకాలంలో ‘జబర్దస్త్’ కామెడీ పెద్దగా పండడం లేదు. రొటీన్ స్కిట్ లతో బోర్ కొట్టిస్తున్నారు.

అయినప్పటికీ టీఆర్ఫీ తగ్గడం లేదు. అది వేరే విషయం. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ షోలో పాపులర్ కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరు. కొన్ని కారణాల వలన ఆయన ఇప్పుడు ‘జబర్దస్త్’ షోని వదిలేయాలని నిర్ణయించుకున్నారట. సుధీర్ గనుక బయటకు వచ్చేస్తే అతడితో పాటు.. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా ఈ షోని వదిలేద్దామని అనుకుంటున్నారట. వీళ్ల ముగ్గురూ ఒక టీమ్ అనే సంగతి తెలిసిందే. సుధీర్ కామెడీ, గెటప్ శ్రీను యాక్షన్, రామ్ ప్రసాద్ పంచ్ లతో వీళ్ల స్కిట్ లు షో మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంటాయి.

అలాంటిది ఈ బ్యాచ్ గనుక బయటకు వచ్చేస్తే.. ఆ ఎఫెక్ట్ రేటింగ్స్ పై పడే ఛాన్స్ ఉంది. మల్లెమాల సంస్థ ప్రతి ఏడాది ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ లతో అగ్రిమెంట్స్ చేయించుకుంటూ ఉంటుంది. ఈసారి అగ్రిమెంట్ పై సైన్ చేయనని సుధీర్ చెప్పడంతో విషయం బయటకొచ్చింది. ప్రస్తుతం సుధీర్ హీరోగా కొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. అలానే కొన్ని షోలను కూడా హోస్ట్ చేస్తున్నాడు సుధీర్. ఈ క్రమంలో ‘జబర్దస్త్’ షోకి టైం కేటాయించలేక.. షో నుంచి తప్పుకుందామని అనుకుంటున్నాడు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!

This post was last modified on November 13, 2021 10:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరపడినట్లే.. టార్గెట్ @2027!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలుపుతో భారత క్రికెట్ మళ్లీ చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ ప్రారంభానికి…

3 hours ago

టీమిండియా విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ ఎంతంటే?

టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో 4 వికెట్ల తేడాతో…

3 hours ago

టీడీపీ త్యాగం!.. కూటమి మరింత ధృడం!

టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఏపీలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఏ మేరకు ఉందన్న విషయాన్ని టీడీపీ అదినేత,…

3 hours ago

ఫైనల్ లో భారత్ ఘనవిజయం… ట్రోఫీ మనదే!

టీమిండియా చరిత్రను తిరగరాసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి టైటిల్‌ను కైవసం…

3 hours ago

కష్టే ఫలి!.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

పార్టీ కోసం కష్ట పడే వారికే పదవులు దక్కుతాయి. పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదు. ఈ మాటలు టీడీపీ…

5 hours ago

రాములమ్మకు ఎమ్మెల్సీ.. అగ్ర నేతల మాట నెగ్గలేదు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన ఖాతాలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అంతా అనుకున్నట్లుగా పార్టీ…

6 hours ago