Movie News

పతి, పత్ని మధ్యలో కియారా

భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల తర్వాత తెలుగులో కనిపించడం మానేసిందేమోగానీ.. బాలీవుడ్‌లో మాత్రం బ్యాండ్ బజాయిస్తోంది కియారా అద్వానీ. వరుస అవకాశాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. చంద్రముఖి చిత్రానికి హిందీ రీమేక్‌ అయిన ‘భూల్‌ భులయ్యా’కి సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో కియారానే హీరోయిన్. వరుణ్ ధావన్‌తో ‘జుగ్‌జుగ్‌ జియో’ అనే మరో సినిమా కూడా చేస్తోంది. ఇవి ఓకే కానీ.. ఓ సినిమాలో మాంచి మసాలా రోల్ ఒకటి చేయబోతున్నట్టు తెలిసింది.

పోయినేడు విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్‌‌ ప్రధాన పాత్రల్లో ‘మిస్టర్ లేలే’ అనే మూవీని అనౌన్స్ చేశాడు కరణ్ జోహార్. శశాంక్ ఖేతన్ దర్శకుడు. ఇలా మొదలు పెట్టారో లేదో అలా మూవీకి బ్రేక్ పడింది. కోవిడ్ వల్ల వచ్చిన మార్పులు, ఇబ్బందులతో నటీనటుల డేట్స్ అడ్జస్ట్ కాక అప్పటికి సినిమా వాయిదా వేశారు. ఇప్పుడు అదే సినిమాని మరో టైటిల్‌తో అనౌన్స్ చేశారు.

‘గోవిందా నామ్‌ మేరా’ పేరుతో రానున్న ఈ సినిమాలో విక్కీ యంగ్ హజ్బెండ్‌గా, భూమి అతనికి భార్యగా నటిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య గొడవలకి కారణమయ్యే నాటీ గాళ్‌ఫ్రెండ్‌గా కియారా కనిపించబోతోందని మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. మొగుడూ పెళ్లాల మధ్యలోకి వచ్చే పరాయి అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. మరి అలాంటి పాత్రలో చేస్తోందంటే ఆమె క్యారెక్టర్‌‌లో మంచి మసాలా ఉంటుందని ఊహిస్తున్నారంతా.

మరోవైపు శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో రామ్‌ చరణ్‌కి జోడీగా నటిస్తోంది కియారా. రీసెంట్‌గా ఒక షెడ్యూల్ కంప్లీటయ్యింది. త్వరలో మరో షెడ్యూల్ మొదలు కానుంది. ఇందులో చీఫ్ మినిస్టర్‌‌గా మారిన ఐఏఎస్‌ ఆఫీసర్‌‌గా చరణ్ నటిస్తుంటే.. కియారా ఓ సిన్సియర్ జర్నలిస్టుగా కనిపిస్తుందటని టాక్. మొత్తానికి అటు సీరియస్ రోల్స్‌తో పాటు ఇటు చిలిపి వేషాలకూ సిద్ధపడుతోంది కియారా.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

28 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

54 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

55 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago