ఒకప్పుడు హీరోయిన్లు బొద్దుగా, ముద్దుగా ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాదు. జీరో సైజ్ అనే ట్రెండ్ రావడంతో ప్రతి ఒక్కరూ తమ ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. గంటల తరబడి జిమ్ లో వ్యాయామాలు చేస్తూ పెర్ఫెక్ట్ షేప్ కోసం ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కూడా వర్కవుట్ చేస్తుంటుంది. ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూనే తన ఫిజిక్ ను మెయింటైన్ చేసుకుంటుంది. కానీ అందరిలా ఎక్కువ సమయం జిమ్ లో గడపదట ఈ బ్యూటీ.
ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.. ‘పైలేట్స్ ఎక్సర్ సైజ్’. పూజా ఎక్కువసేపు ఈ వ్యాయామం చేస్తుందట. జిమ్ కి వెళ్లినా, వెళ్లకపోయినా ఇంట్లోనే పైలేట్స్ సెషన్స్ చేస్తుంది. ఒక్కరోజు కూడా ఈ సెషన్ మిస్ అవ్వదట. ముంబైలో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా.. రోజులో కొంత సమయం పైలేట్స్ సెషన్ కోసం కేటాయిస్తుంది. అలానే యోగా ఎక్కువగా చేస్తుంటుంది. అందుకే తన ఫిజిక్ ను పెర్ఫెక్ట్ గా కాపాడుకోగలుగుతుంది. ఇంకెందుకు లేటు.. మీరు కూడా పైలేట్స్ ఎక్సర్ సైజ్ ట్రై చేయండి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి నెలలో ‘రాధేశ్యామ్’, ఫిబ్రవరిలో ‘ఆచార్య’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో పూజా సందడి చేయబోతుందన్నమాట. ఇక ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’లో నటిస్తోన్న ఈ బ్యూటీ.. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా సైన్ చేసింది. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి.
This post was last modified on November 12, 2021 7:21 pm
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…