ఒకప్పుడు హీరోయిన్లు బొద్దుగా, ముద్దుగా ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాదు. జీరో సైజ్ అనే ట్రెండ్ రావడంతో ప్రతి ఒక్కరూ తమ ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. గంటల తరబడి జిమ్ లో వ్యాయామాలు చేస్తూ పెర్ఫెక్ట్ షేప్ కోసం ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కూడా వర్కవుట్ చేస్తుంటుంది. ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూనే తన ఫిజిక్ ను మెయింటైన్ చేసుకుంటుంది. కానీ అందరిలా ఎక్కువ సమయం జిమ్ లో గడపదట ఈ బ్యూటీ.
ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.. ‘పైలేట్స్ ఎక్సర్ సైజ్’. పూజా ఎక్కువసేపు ఈ వ్యాయామం చేస్తుందట. జిమ్ కి వెళ్లినా, వెళ్లకపోయినా ఇంట్లోనే పైలేట్స్ సెషన్స్ చేస్తుంది. ఒక్కరోజు కూడా ఈ సెషన్ మిస్ అవ్వదట. ముంబైలో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా.. రోజులో కొంత సమయం పైలేట్స్ సెషన్ కోసం కేటాయిస్తుంది. అలానే యోగా ఎక్కువగా చేస్తుంటుంది. అందుకే తన ఫిజిక్ ను పెర్ఫెక్ట్ గా కాపాడుకోగలుగుతుంది. ఇంకెందుకు లేటు.. మీరు కూడా పైలేట్స్ ఎక్సర్ సైజ్ ట్రై చేయండి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి నెలలో ‘రాధేశ్యామ్’, ఫిబ్రవరిలో ‘ఆచార్య’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో పూజా సందడి చేయబోతుందన్నమాట. ఇక ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’లో నటిస్తోన్న ఈ బ్యూటీ.. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా సైన్ చేసింది. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి.
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…