మరక్కార్: ది లయన్ ఆఫ్ అరేబియన్ సీ.. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వంద కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక ఖర్చుతో, అత్యంత భారీతనంతో తీర్చిదిద్దిన చిత్రం. విడుదలకు ముందే జాతీయ అవార్డుల్లో పోటీ పడి ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.
ఇలాంటి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటే అభిమానుల మనస్సు చివుక్కుమంటోంది. కేరళలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం, థియేటర్ల విషయంలో ఆంక్షలు చాలా కాలం పాటు కొనసాగడంతో అక్కడ పెద్ద పెద్ద సినిమాలన్నింటినీ ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. కేరళ థియేటర్ మార్కెట్ చిన్నది కావడం వల్ల కూడా ఓటీటీ బాట పడుతుండటానికి ఓ కారణమే. కానీ మలయాళ పరిశ్రమకు బాహుబలి లాంటి మరక్కార్ సినిమాను పెద్ద తెరల్లో కాకుండా స్మాల్ స్క్రీన్ మీద చూడాల్సి రావడం అక్కడి ప్రేక్షకులకు రుచించడం లేదు.
దీంతో మరక్కార్ థియేట్రికల్ రిలీజ్ కోసం సోషల్ మీడియాలో గట్టిగా డిమాండ్లు చేస్తున్నారు. బయట కూడా మోహన్ లాల్ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కేరళ సాంస్కృతిక శాఖా మంత్రి సాజి చెరియన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. మరక్కార్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేలా ఆయన ఇటు సినిమా నిర్మాతలు, అటు ఓటీటీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
స్వయంగా ఆయనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ గురించి తాజాగా ప్రకటన చేయడం విశేషం. ఈ చిత్రాన్ని వెండితెరల్లోనూ చూడొచ్చని ఆయన ప్రకటించారు. ఐతే ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాలేదని తెలిపారు. మాలీవుడ్ అంచనాల ప్రకారం డిసెంబరు 2న మరక్కార్ ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో ఒకేసారి విడుదలవుతుందని భావిస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
This post was last modified on November 11, 2021 9:42 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…