మెగాస్టార్ చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్ లో ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని ఊటీలో పూర్తి చేశారు. చిరు చేతికి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మలయాళ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకుంటారనే విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఆ రోల్ కోసం ఫైనల్ చేశారని అన్నారు. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అలానే సినిమాలో ఓ పాట కోసం హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ను సంప్రదిస్తున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాలన్నింటిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు.
ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. చిరు ‘గాడ్ ఫాదర్’ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేసే పాట కాబట్టి దాని స్థాయికి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రిట్నీ స్పియర్ తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఆమెతో ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా..? లేక మరేదైనానా అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాక ఓ క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి సినిమాలో సల్మాన్ నటించబోతున్నాడని.. చిరుతో కలిసి డాన్స్ కూడా చేస్తాడని క్లారిటీ వచ్చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…