మెగాస్టార్ చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్ లో ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని ఊటీలో పూర్తి చేశారు. చిరు చేతికి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మలయాళ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకుంటారనే విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఆ రోల్ కోసం ఫైనల్ చేశారని అన్నారు. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అలానే సినిమాలో ఓ పాట కోసం హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ను సంప్రదిస్తున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాలన్నింటిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు.
ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. చిరు ‘గాడ్ ఫాదర్’ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేసే పాట కాబట్టి దాని స్థాయికి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రిట్నీ స్పియర్ తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఆమెతో ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా..? లేక మరేదైనానా అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాక ఓ క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి సినిమాలో సల్మాన్ నటించబోతున్నాడని.. చిరుతో కలిసి డాన్స్ కూడా చేస్తాడని క్లారిటీ వచ్చేసింది.
This post was last modified on November 11, 2021 12:35 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…