మెగాస్టార్ చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్ లో ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని ఊటీలో పూర్తి చేశారు. చిరు చేతికి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మలయాళ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకుంటారనే విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఆ రోల్ కోసం ఫైనల్ చేశారని అన్నారు. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అలానే సినిమాలో ఓ పాట కోసం హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ను సంప్రదిస్తున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాలన్నింటిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు.
ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. చిరు ‘గాడ్ ఫాదర్’ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేసే పాట కాబట్టి దాని స్థాయికి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రిట్నీ స్పియర్ తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఆమెతో ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా..? లేక మరేదైనానా అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాక ఓ క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి సినిమాలో సల్మాన్ నటించబోతున్నాడని.. చిరుతో కలిసి డాన్స్ కూడా చేస్తాడని క్లారిటీ వచ్చేసింది.
This post was last modified on November 11, 2021 12:35 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…