ప్రపంచ సినీ చరిత్రలో ఏది గొప్ప సినిమా.. ఈ ఏడాదికి అంతర్జాతీయ స్థాయిలో ఏది బెస్ట్ మూవీ.. ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే అందరూ చూసేది ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)నే. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగానే ఇక్కడ సినిమాలకు రేటింగ్ ఇస్తుంటుందీ సంస్థ. అభిప్రాయాలను క్రోడీకరించి అందరికీ ఆమోదయోగ్యంగా అనిపించేలాగానే ఆ సంస్థ రేటింగ్స్ ప్రకటిస్తుంటుంది. అందుకే చాలామంది దాన్ని అనుసరిస్తారు. ఈ జాబితాలో దశాబ్దాల నుంచి ‘షావ్షాంక్ రిడెంప్షన్’ అగ్ర స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఐతే కొత్తగా రిలీజయ్యే సినిమాలు జనాలకు తెగ నచ్చేస్తే.. పదికి పది రేటింగ్స్ ఇచ్చేసి ఆల్ టైం టాప్ లిస్టులో తీసుకెళ్లి పైన కూర్చోబెట్టేస్తుంటారు. తాత్కాలికంగా అయినా ఇలా కొన్ని కొత్త చిత్రాలు అగ్ర స్థానాన్ని అలంకరిస్తుంటాయి. గత వారం విడుదలైన తమిళ చిత్రం ‘జై భీమ్’ ఈ గౌరవాన్నే దక్కించుకుంది. ఓవరాల్ రేటింగ్లో ‘షావ్షాంక్ రిడెంప్షన్’ 9.3 రేటింగ్తో అగ్ర స్థానంలో ఉండగా.. ‘జై భీమ్’ 9.6 రేటింగ్తో అగ్ర స్థానానికి చేరడం విశేషం. 53 వేల మందికి పైగా ‘జై భీమ్’కు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా దీనికి తాత్కాలికంగా అగ్రస్థానం దక్కింది.
ఐతే ఈ రేటింగ్ తాత్కాలికమే అని భావించవచ్చు. గతంలో ‘1 నేనొక్కడినే’ లాంటి చిత్రాలు సైతం రిలీజ్ టైంలో ఐఎండీబీలో టాప్-5 లిస్టులో చోటు సంపాదించినవే. కాల క్రమంలో ఓటింగ్స్ పెరిగేకొద్దీ సగటు రేటింగ్ తగ్గుతుంది. ‘షావ్షాంక్ రిడెంప్షన్’ లాంటి చిత్రాలకు కోట్ల మంది ఇచ్చిన రేటింగ్స్ సగటు తీసి ఫైనల్ రేటింగ్ ఇచ్చి ఉంటారు. ఇలా అది 9.3 సగటు రేటింగ్తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ సినిమా తర్వాత ది గాడ్ ఫాదర్ (9.2), ది డార్క్ నైట్ (9.1), ది డార్క్ ఫాదర్ (9.0) వరుస క్రమంలో ఉన్నాయి.
This post was last modified on November 10, 2021 10:59 am
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…
ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్కు గుర్తు తెలియని…
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…