Movie News

సూర్య గొప్ప మనసుకు హ్యాట్సాఫ్


దక్షిణాదిన సినిమా పరంగా.. వ్యక్తిగతంగా సామాజిక బాధ్యత ఎప్పుడూ మరవని వ్యక్తుల్లో సూర్య ఒకడు. తెరపై తరచుగా గొప్ప గొప్ప పాత్రలు చేయడం.. సీరియస్ ఇష్యూలను చర్చించడం.. సొసైటీకి మంచి చేసే, జనాల్లో ఆలోచన రేకెత్తించే, వారికి మంచి సందేశాలనిచ్చే సినిమాలను చేయడం.. నిర్మించడం చేస్తుంటాడు సూర్య. అలాగే వ్యక్తిగతంగా చాలా పెద్ద స్థాయిలో అతను సేవా కార్యక్రమాలు చేపడుతుంటాడన్న సంగతీ తెలిసిందే. కొన్ని సామాజిక సమస్యల మీద గట్టిగా గళం వినిపించడంలోనూ సూర్యకు మంచి పేరుంది. అతడికున్న ఈ ఇమేజ్ కొన్ని పాత్రల విషయంలోనూ ప్రతిఫలించి ఆ క్యారెక్టర్లకు నిండుదనం తెచ్చి పెడుతుంటుంది.

తాజాగా సూర్య నుంచి వచ్చిన ‘జై భీమ్’ విషయంలో అదే జరిగింది. తమిళనాట జరిగిన ఓ లాకప్ డెత్ ఆధారంగా గొప్ప కథాకథనాలతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అందులో సూర్య చేసిన చంద్రు పాత్ర అందరినీ కట్టి పడేసింది. ఇలాంటి సినిమాకు హీరోగానే కాక నిర్మాతగా కూడా సూర్య ఇచ్చిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఈ సినిమాను అందరూ ఓన్ చేసుకుని దాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సినిమా ద్వారా ఆదివాసీల బాధల్ని జనాలకు తెలిసేలా చేసి.. అందరి దృష్టీ వారిపై పడేలా చేయడమే కాదు.. వారికి నేరుగా తన ద్వారా కోటి రూపాయల సాయం అందించడం ద్వారా తన గొప్ప మనసును చాటుకున్నాడు సూర్య. ఆదివాసీల విద్య కోసం ఉపయోగించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ కోటి రూపాయల విరాళాన్ని సూర్య అందజేశాడు.

సినిమా రిలీజ్ టైంలోనే ఈ సాయం గురించి ప్రకటించిన సూర్య.. ఇప్పుడు తన భార్య జ్యోతికతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఈ చెక్కును అందజేశాడు. సినిమా నుంచి వచ్చిన లాభాల్లోంచే ఈ కోటి రూపాయలు పక్కన పెట్టి ఆదివాసీలకు అందిస్తున్నాడు సూర్య. ఇలాంటి సినిమా చేయడమే గొప్ప విషయం అంటే.. ఇంత పెద్ద మొత్తంలో ఆదివాసీలకు సాయం అందించడం ద్వారా సూర్య అందరి మనసులూ దోచేశాడు.

This post was last modified on November 9, 2021 9:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

6 minutes ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

7 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

3 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

8 hours ago