‘ఈరోజుల్లో’, ‘బస్ స్టాప్’ వంటి చిన్న సినిమాలతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు మారుతి. ఆ తరువాత మెల్లగా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వెంకటేష్ లాంటి స్టార్ ని కూడా డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. నిజానికి మారుతి ప్రయత్నిస్తే.. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకొస్తారు. కానీ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రావడం లేదు. గతంలో అల్లు అర్జున్ హీరోగా మారుతి ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అది సెట్స్ పైకి వెళ్లలేదు.
మారుతి-బన్నీ మంచి స్నేహితులు. ఎప్పటికైనా.. బన్నీతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు మారుతి. ఇంతలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ఫిక్సైంది. ప్రస్తుతం ఈ సినిమా కథ మీద వర్క్ చేస్తున్నారు మారుతి. ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్స్ నడుస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ లో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా సినిమా ఉంటుందని అన్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని మారుతి ఎంతవరకు హ్యాండిల్ చేయగలరనే సందేహాలు తలెత్తాయి.
తాజాగా ఈ సినిమా గురించి మారుతి మాట్లాడారు. ప్రభాస్ తో సినిమా చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని.. తనెప్పుడూ హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకోనని.. తన కథకు ఎవరైతే బాగుంటారో.. వాళ్ల దగ్గరకు వెళ్తానని చెప్పారు. ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. తనకు కూడా ఆ కోరిక ఉందని అన్నారు. మంచి కథ దొరికితే కచ్చితంగా ప్రభాస్ ని సంప్రదిస్తానని.. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం మారుతి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…