‘ఈరోజుల్లో’, ‘బస్ స్టాప్’ వంటి చిన్న సినిమాలతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు మారుతి. ఆ తరువాత మెల్లగా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వెంకటేష్ లాంటి స్టార్ ని కూడా డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. నిజానికి మారుతి ప్రయత్నిస్తే.. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకొస్తారు. కానీ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రావడం లేదు. గతంలో అల్లు అర్జున్ హీరోగా మారుతి ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అది సెట్స్ పైకి వెళ్లలేదు.
మారుతి-బన్నీ మంచి స్నేహితులు. ఎప్పటికైనా.. బన్నీతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు మారుతి. ఇంతలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ఫిక్సైంది. ప్రస్తుతం ఈ సినిమా కథ మీద వర్క్ చేస్తున్నారు మారుతి. ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్స్ నడుస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ లో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా సినిమా ఉంటుందని అన్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని మారుతి ఎంతవరకు హ్యాండిల్ చేయగలరనే సందేహాలు తలెత్తాయి.
తాజాగా ఈ సినిమా గురించి మారుతి మాట్లాడారు. ప్రభాస్ తో సినిమా చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని.. తనెప్పుడూ హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకోనని.. తన కథకు ఎవరైతే బాగుంటారో.. వాళ్ల దగ్గరకు వెళ్తానని చెప్పారు. ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. తనకు కూడా ఆ కోరిక ఉందని అన్నారు. మంచి కథ దొరికితే కచ్చితంగా ప్రభాస్ ని సంప్రదిస్తానని.. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం మారుతి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
This post was last modified on November 8, 2021 11:21 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…