‘ఈరోజుల్లో’, ‘బస్ స్టాప్’ వంటి చిన్న సినిమాలతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు మారుతి. ఆ తరువాత మెల్లగా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వెంకటేష్ లాంటి స్టార్ ని కూడా డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. నిజానికి మారుతి ప్రయత్నిస్తే.. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకొస్తారు. కానీ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రావడం లేదు. గతంలో అల్లు అర్జున్ హీరోగా మారుతి ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అది సెట్స్ పైకి వెళ్లలేదు.
మారుతి-బన్నీ మంచి స్నేహితులు. ఎప్పటికైనా.. బన్నీతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు మారుతి. ఇంతలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ఫిక్సైంది. ప్రస్తుతం ఈ సినిమా కథ మీద వర్క్ చేస్తున్నారు మారుతి. ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్స్ నడుస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ లో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా సినిమా ఉంటుందని అన్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని మారుతి ఎంతవరకు హ్యాండిల్ చేయగలరనే సందేహాలు తలెత్తాయి.
తాజాగా ఈ సినిమా గురించి మారుతి మాట్లాడారు. ప్రభాస్ తో సినిమా చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని.. తనెప్పుడూ హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకోనని.. తన కథకు ఎవరైతే బాగుంటారో.. వాళ్ల దగ్గరకు వెళ్తానని చెప్పారు. ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. తనకు కూడా ఆ కోరిక ఉందని అన్నారు. మంచి కథ దొరికితే కచ్చితంగా ప్రభాస్ ని సంప్రదిస్తానని.. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం మారుతి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
This post was last modified on November 8, 2021 11:21 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…