రారా కృష్ణయ్యా అని సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన సినిమా. రెజీనా కసాండ్రా కథానాయికగా చేసింది. సందీప్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత మంచి ఊపులో ఉన్న టైంలో ఈ సినిమా చేశాడు. సినిమాకు బాగానే హైప్ వచ్చింది. దీని ప్రోమోలు చూసి సినిమా సూపర్ హిట్టవుతుందని అంచనా వేశారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. సినిమా అనుకున్నంతగా లేక డిజాస్టర్ అయింది. ‘రారా కృష్ణయ్య’ తీసిన దర్శకుడి పేరు మహేష్ బాబు.పి.
పాతికేళ్ల లోపు వయసులోనే ఈ సినిమా తీసి..దానికి మంచి హైప్ తీసుకొచ్చిన ఈ దర్శకుడికి బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిరాశ తప్పలేదు. ఆ దెబ్బ నుంచి అతను కోలుకోవడానికి చాలా టైం పట్టింది. తొలి సినిమా తీశాక ఏడేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయాడు. ఎట్టకేలకు అతడికి రెండో సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని ఈ ఆదివారమే ప్రకటించారు.
అనుష్క ప్రధాన పాత్రలో యువి క్రియేషన్స్ నిర్మాణంలో మహేష్ బాబు తన రెండో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మొత్తానికి చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఈ యువ దర్శకుడు క్రేజీ కాంబినేషన్లోనే సినిమాను సెట్ చేసుకున్నాడు. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ సినిమా.. అందులోనూ యువి క్రియేషన్స్ లాంటి టాప్ బేనర్లో సినిమా అంటే చిన్న అవకాశమేమీ కాదు. మరి తొలి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయిన మహేష్ బాబు.. ఈ సినిమాతో అయినా మంచి హిట్ కొట్టి దర్శకుడిగా సక్సెస్ అవుతాడేమో చూడాలి.
యువి బేనర్లో అనుష్క చేసిన మిర్చి, భాగమతి ఘనవిజయాలందుకున్న సంగతి తెలిసిందే. ‘భాగమతి’ తర్వాత అనుష్క చేసిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘నిశ్శబ్దం’ నిరాశ పరిచింది. దీంతో ఆమె చాలా గ్యాప్ తీసుకుని కొత్త సినిమాకు ఓకే చెప్పింది. ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్ అని అంటున్నారు. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…