గూగుల్లోకి వెళ్లి లిజోమోల్ జోస్ అని కొట్టి చూడండి. కొన్ని ఫొటోలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత లిజో మోల్ జోస్ ఇన్ జై భీమ్ అని సెర్చ్ చేసి చూడండి. షాకై నోరెళ్లబెట్టకపోతే ఒట్టు. తొలి సెర్చ్లో ఎంతో అందంగా, మోడర్న్గా కనిపించిన ఈ అమ్మాయే ‘జై భీమ్’ సినిమాలో పేద గిరిజన మహిళగా పూర్తి డీగ్లామరస్ రోల్లో నటించిందంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. డీ గ్లామరస్ రోల్ కోసం ఎంతోమంది హీరోయిన్లు మేకోవర్ అయి ఉంటారు. కానీ లిజో మేకోవర్ మాత్రం వాటన్నింటినీ తలదన్నేదే. కేవలం లుక్ మార్చుకోవడం మాత్రమే కాదు.. పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయిన తీరుకు ఫిదా అవకుండా ఉండలేం.
సినతల్లి పాత్రలో ఆమె ఎంత గొప్పగా నటించిందంటే.. సినిమా చూస్తూ ఏదో ఒక దశలో ప్రతి ప్రేక్షకుడికీ కళ్లు చెమరుస్తాయి. సినతల్లి పాత్ర తాలూకు అంతులేని వేదనను కచ్చితంగా ప్రేక్షకుడు ఫీలై ఆమె పట్ల జాలి భావం కలుగుతుంది. హృదయం ద్రవించేలా ఆ పాత్రను లిజోమోల్ జోస్ పండించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. పొలం పనుల్లో కనిపించే తొలి సన్నివేశంలోనే లిజో పాత్ర తాలూకు అమాయకత్వం చూసి ముచ్చట పడతాం. చూడ్డానికి నల్లగా కనిపిస్తుంది కానీ.. ఆమెలోని కళ ముచ్చటగొలుపుతుంది.
ఇక ఒక దశ దాటాక లిజో పాత్రకు సంబంధించి కన్నీళ్లే చూస్తాం. తనతో పోలీసులు వ్యవహరించే తీరు చూసి మనసు చివుక్కుమంటుంది. అంత క్రూరంగా ప్రవర్తించిన పోలీసులే.. ఆమెకు తల వంచే ఓ సన్నివేశంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక కోర్టులో కేసు గెలిచాక బయట వర్షంలో తడుస్తూ కనిపించే లిజోను చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేం. ఒక పాత్ర ఇలాంటి మేకోవర్.. ఇంత గొప్ప నటన అరుదుగా చూస్తుంటాం. ఇందుకుగాను లిజోకు ఎన్ని అవార్డులిచ్చినా తప్పులేదు. ఈ ఏడాదికి ఉత్తమ జాతీయ నటిగా లిజోకు పురస్కారం దక్కినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on November 7, 2021 4:15 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…