గూగుల్లోకి వెళ్లి లిజోమోల్ జోస్ అని కొట్టి చూడండి. కొన్ని ఫొటోలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత లిజో మోల్ జోస్ ఇన్ జై భీమ్ అని సెర్చ్ చేసి చూడండి. షాకై నోరెళ్లబెట్టకపోతే ఒట్టు. తొలి సెర్చ్లో ఎంతో అందంగా, మోడర్న్గా కనిపించిన ఈ అమ్మాయే ‘జై భీమ్’ సినిమాలో పేద గిరిజన మహిళగా పూర్తి డీగ్లామరస్ రోల్లో నటించిందంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. డీ గ్లామరస్ రోల్ కోసం ఎంతోమంది హీరోయిన్లు మేకోవర్ అయి ఉంటారు. కానీ లిజో మేకోవర్ మాత్రం వాటన్నింటినీ తలదన్నేదే. కేవలం లుక్ మార్చుకోవడం మాత్రమే కాదు.. పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయిన తీరుకు ఫిదా అవకుండా ఉండలేం.
సినతల్లి పాత్రలో ఆమె ఎంత గొప్పగా నటించిందంటే.. సినిమా చూస్తూ ఏదో ఒక దశలో ప్రతి ప్రేక్షకుడికీ కళ్లు చెమరుస్తాయి. సినతల్లి పాత్ర తాలూకు అంతులేని వేదనను కచ్చితంగా ప్రేక్షకుడు ఫీలై ఆమె పట్ల జాలి భావం కలుగుతుంది. హృదయం ద్రవించేలా ఆ పాత్రను లిజోమోల్ జోస్ పండించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. పొలం పనుల్లో కనిపించే తొలి సన్నివేశంలోనే లిజో పాత్ర తాలూకు అమాయకత్వం చూసి ముచ్చట పడతాం. చూడ్డానికి నల్లగా కనిపిస్తుంది కానీ.. ఆమెలోని కళ ముచ్చటగొలుపుతుంది.
ఇక ఒక దశ దాటాక లిజో పాత్రకు సంబంధించి కన్నీళ్లే చూస్తాం. తనతో పోలీసులు వ్యవహరించే తీరు చూసి మనసు చివుక్కుమంటుంది. అంత క్రూరంగా ప్రవర్తించిన పోలీసులే.. ఆమెకు తల వంచే ఓ సన్నివేశంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక కోర్టులో కేసు గెలిచాక బయట వర్షంలో తడుస్తూ కనిపించే లిజోను చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేం. ఒక పాత్ర ఇలాంటి మేకోవర్.. ఇంత గొప్ప నటన అరుదుగా చూస్తుంటాం. ఇందుకుగాను లిజోకు ఎన్ని అవార్డులిచ్చినా తప్పులేదు. ఈ ఏడాదికి ఉత్తమ జాతీయ నటిగా లిజోకు పురస్కారం దక్కినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on November 7, 2021 4:15 am
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…