గూగుల్లోకి వెళ్లి లిజోమోల్ జోస్ అని కొట్టి చూడండి. కొన్ని ఫొటోలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత లిజో మోల్ జోస్ ఇన్ జై భీమ్ అని సెర్చ్ చేసి చూడండి. షాకై నోరెళ్లబెట్టకపోతే ఒట్టు. తొలి సెర్చ్లో ఎంతో అందంగా, మోడర్న్గా కనిపించిన ఈ అమ్మాయే ‘జై భీమ్’ సినిమాలో పేద గిరిజన మహిళగా పూర్తి డీగ్లామరస్ రోల్లో నటించిందంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. డీ గ్లామరస్ రోల్ కోసం ఎంతోమంది హీరోయిన్లు మేకోవర్ అయి ఉంటారు. కానీ లిజో మేకోవర్ మాత్రం వాటన్నింటినీ తలదన్నేదే. కేవలం లుక్ మార్చుకోవడం మాత్రమే కాదు.. పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయిన తీరుకు ఫిదా అవకుండా ఉండలేం.
సినతల్లి పాత్రలో ఆమె ఎంత గొప్పగా నటించిందంటే.. సినిమా చూస్తూ ఏదో ఒక దశలో ప్రతి ప్రేక్షకుడికీ కళ్లు చెమరుస్తాయి. సినతల్లి పాత్ర తాలూకు అంతులేని వేదనను కచ్చితంగా ప్రేక్షకుడు ఫీలై ఆమె పట్ల జాలి భావం కలుగుతుంది. హృదయం ద్రవించేలా ఆ పాత్రను లిజోమోల్ జోస్ పండించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. పొలం పనుల్లో కనిపించే తొలి సన్నివేశంలోనే లిజో పాత్ర తాలూకు అమాయకత్వం చూసి ముచ్చట పడతాం. చూడ్డానికి నల్లగా కనిపిస్తుంది కానీ.. ఆమెలోని కళ ముచ్చటగొలుపుతుంది.
ఇక ఒక దశ దాటాక లిజో పాత్రకు సంబంధించి కన్నీళ్లే చూస్తాం. తనతో పోలీసులు వ్యవహరించే తీరు చూసి మనసు చివుక్కుమంటుంది. అంత క్రూరంగా ప్రవర్తించిన పోలీసులే.. ఆమెకు తల వంచే ఓ సన్నివేశంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక కోర్టులో కేసు గెలిచాక బయట వర్షంలో తడుస్తూ కనిపించే లిజోను చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేం. ఒక పాత్ర ఇలాంటి మేకోవర్.. ఇంత గొప్ప నటన అరుదుగా చూస్తుంటాం. ఇందుకుగాను లిజోకు ఎన్ని అవార్డులిచ్చినా తప్పులేదు. ఈ ఏడాదికి ఉత్తమ జాతీయ నటిగా లిజోకు పురస్కారం దక్కినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on November 7, 2021 4:15 am
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…