నందమూరి బాలకృష్ణ.. అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా ఓటీటీ కోసం ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చేయడం ఒక సంచలనమే. ఈ కలయికను అసలెవ్వరూ ఊహించలేదు. వివిధ కారణాల వల్ల మెగా ఫ్యామిలీతో బాలయ్యకు కొంచెం గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఈ నందమూరి హీరో వచ్చి ఆహా ఓటీటీ కోసం షో చేస్తాడని ఎవరూ అనుకోలేదు. మరి అరవింద్ బాలయ్యతో ఏం మాట్లాడారో.. ఎలా ఒప్పించారో కానీ.. ఈ షోకు నందమూరి హీరో వల్ల బంపర్ క్రేజ్ వచ్చిన మాట వాస్తవం. దీపావళి కానుకగా రిలీజైన తొలి ఎపిసోడ్కు స్పందన కూడా అదిరిపోయింది. ఐతే బాలయ్యతో అల్లు వారి బంధం ఇప్పుడు మరో స్థాయికి వెళ్లబోతున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం. తొలిసారిగా నందమూరి నటసింహం గీతా ఆర్ట్స్లో సినిమా చేయబోతున్నాడట. ఇందుకోసం చర్చలు జోరుగానే సాగుతున్నాయట. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
బాలయ్యతో ఇప్పటికే క్రిష్ రెండు ప్రాజెక్టులు చేశాడు. అందులో ఒకటైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి ఫలితాన్నే అందుకుంది. ‘యన్.టి.ఆర్’ మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఈ ఇద్దరినీ మళ్లీ కలపబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. నిజానికి గీతా ఆర్ట్స్ బేనర్లో మెగా హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. గీతా ఆర్ట్స్-2 బేనర్ పెట్టినప్పటి నుంచి చిన్న, మీడియం బడ్జెట్లో వేరే హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గీతా ఆర్ట్స్లో బాలయ్య సినిమా చేస్తే అదొక స్పెషల్ ఫిలిం అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ‘అఖండ’ను పూర్తి చేసి.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాకు బాలయ్య సన్నద్ధం అవుతున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో బాలయ్యకు ఓ కమిట్మెంట్ ఉంది. మరి గీతా ఆర్ట్స్లో సినిమా ఎప్పుడుంటుందో చూడాలి.
This post was last modified on November 7, 2021 3:15 am
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…