నందమూరి బాలకృష్ణ.. అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా ఓటీటీ కోసం ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చేయడం ఒక సంచలనమే. ఈ కలయికను అసలెవ్వరూ ఊహించలేదు. వివిధ కారణాల వల్ల మెగా ఫ్యామిలీతో బాలయ్యకు కొంచెం గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఈ నందమూరి హీరో వచ్చి ఆహా ఓటీటీ కోసం షో చేస్తాడని ఎవరూ అనుకోలేదు. మరి అరవింద్ బాలయ్యతో ఏం మాట్లాడారో.. ఎలా ఒప్పించారో కానీ.. ఈ షోకు నందమూరి హీరో వల్ల బంపర్ క్రేజ్ వచ్చిన మాట వాస్తవం. దీపావళి కానుకగా రిలీజైన తొలి ఎపిసోడ్కు స్పందన కూడా అదిరిపోయింది. ఐతే బాలయ్యతో అల్లు వారి బంధం ఇప్పుడు మరో స్థాయికి వెళ్లబోతున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం. తొలిసారిగా నందమూరి నటసింహం గీతా ఆర్ట్స్లో సినిమా చేయబోతున్నాడట. ఇందుకోసం చర్చలు జోరుగానే సాగుతున్నాయట. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
బాలయ్యతో ఇప్పటికే క్రిష్ రెండు ప్రాజెక్టులు చేశాడు. అందులో ఒకటైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి ఫలితాన్నే అందుకుంది. ‘యన్.టి.ఆర్’ మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఈ ఇద్దరినీ మళ్లీ కలపబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. నిజానికి గీతా ఆర్ట్స్ బేనర్లో మెగా హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. గీతా ఆర్ట్స్-2 బేనర్ పెట్టినప్పటి నుంచి చిన్న, మీడియం బడ్జెట్లో వేరే హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గీతా ఆర్ట్స్లో బాలయ్య సినిమా చేస్తే అదొక స్పెషల్ ఫిలిం అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ‘అఖండ’ను పూర్తి చేసి.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాకు బాలయ్య సన్నద్ధం అవుతున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో బాలయ్యకు ఓ కమిట్మెంట్ ఉంది. మరి గీతా ఆర్ట్స్లో సినిమా ఎప్పుడుంటుందో చూడాలి.
This post was last modified on November 7, 2021 3:15 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…