నందమూరి బాలకృష్ణ.. అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా ఓటీటీ కోసం ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చేయడం ఒక సంచలనమే. ఈ కలయికను అసలెవ్వరూ ఊహించలేదు. వివిధ కారణాల వల్ల మెగా ఫ్యామిలీతో బాలయ్యకు కొంచెం గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఈ నందమూరి హీరో వచ్చి ఆహా ఓటీటీ కోసం షో చేస్తాడని ఎవరూ అనుకోలేదు. మరి అరవింద్ బాలయ్యతో ఏం మాట్లాడారో.. ఎలా ఒప్పించారో కానీ.. ఈ షోకు నందమూరి హీరో వల్ల బంపర్ క్రేజ్ వచ్చిన మాట వాస్తవం. దీపావళి కానుకగా రిలీజైన తొలి ఎపిసోడ్కు స్పందన కూడా అదిరిపోయింది. ఐతే బాలయ్యతో అల్లు వారి బంధం ఇప్పుడు మరో స్థాయికి వెళ్లబోతున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం. తొలిసారిగా నందమూరి నటసింహం గీతా ఆర్ట్స్లో సినిమా చేయబోతున్నాడట. ఇందుకోసం చర్చలు జోరుగానే సాగుతున్నాయట. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
బాలయ్యతో ఇప్పటికే క్రిష్ రెండు ప్రాజెక్టులు చేశాడు. అందులో ఒకటైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి ఫలితాన్నే అందుకుంది. ‘యన్.టి.ఆర్’ మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఈ ఇద్దరినీ మళ్లీ కలపబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. నిజానికి గీతా ఆర్ట్స్ బేనర్లో మెగా హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. గీతా ఆర్ట్స్-2 బేనర్ పెట్టినప్పటి నుంచి చిన్న, మీడియం బడ్జెట్లో వేరే హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గీతా ఆర్ట్స్లో బాలయ్య సినిమా చేస్తే అదొక స్పెషల్ ఫిలిం అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ‘అఖండ’ను పూర్తి చేసి.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాకు బాలయ్య సన్నద్ధం అవుతున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో బాలయ్యకు ఓ కమిట్మెంట్ ఉంది. మరి గీతా ఆర్ట్స్లో సినిమా ఎప్పుడుంటుందో చూడాలి.
This post was last modified on November 7, 2021 3:15 am
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…