నందమూరి బాలకృష్ణ.. అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా ఓటీటీ కోసం ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చేయడం ఒక సంచలనమే. ఈ కలయికను అసలెవ్వరూ ఊహించలేదు. వివిధ కారణాల వల్ల మెగా ఫ్యామిలీతో బాలయ్యకు కొంచెం గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఈ నందమూరి హీరో వచ్చి ఆహా ఓటీటీ కోసం షో చేస్తాడని ఎవరూ అనుకోలేదు. మరి అరవింద్ బాలయ్యతో ఏం మాట్లాడారో.. ఎలా ఒప్పించారో కానీ.. ఈ షోకు నందమూరి హీరో వల్ల బంపర్ క్రేజ్ వచ్చిన మాట వాస్తవం. దీపావళి కానుకగా రిలీజైన తొలి ఎపిసోడ్కు స్పందన కూడా అదిరిపోయింది. ఐతే బాలయ్యతో అల్లు వారి బంధం ఇప్పుడు మరో స్థాయికి వెళ్లబోతున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం. తొలిసారిగా నందమూరి నటసింహం గీతా ఆర్ట్స్లో సినిమా చేయబోతున్నాడట. ఇందుకోసం చర్చలు జోరుగానే సాగుతున్నాయట. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
బాలయ్యతో ఇప్పటికే క్రిష్ రెండు ప్రాజెక్టులు చేశాడు. అందులో ఒకటైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి ఫలితాన్నే అందుకుంది. ‘యన్.టి.ఆర్’ మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఈ ఇద్దరినీ మళ్లీ కలపబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. నిజానికి గీతా ఆర్ట్స్ బేనర్లో మెగా హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. గీతా ఆర్ట్స్-2 బేనర్ పెట్టినప్పటి నుంచి చిన్న, మీడియం బడ్జెట్లో వేరే హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గీతా ఆర్ట్స్లో బాలయ్య సినిమా చేస్తే అదొక స్పెషల్ ఫిలిం అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ‘అఖండ’ను పూర్తి చేసి.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాకు బాలయ్య సన్నద్ధం అవుతున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో బాలయ్యకు ఓ కమిట్మెంట్ ఉంది. మరి గీతా ఆర్ట్స్లో సినిమా ఎప్పుడుంటుందో చూడాలి.
This post was last modified on November 7, 2021 3:15 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…