దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగానే కాదు.. అత్యధికంగా పారితోషికం తీసుకున్న డైరెక్టర్ అన్నంతనే గుర్తుకు వస్తారు ఎస్ఎస్ రాజమౌళి. తన కెరీర్ లో ఇప్పటివరకు తీసిన ఏ మూవీ కూడా పరాజయం కాకుండా ఉన్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం. ఆయన సినిమా అన్నంతనే అందరూ దాని వైపు చూడటమే కాదు.. ఆ ప్రాజెక్టు గంటల వ్యవధిలో క్రేజీగా మారిపోవటం తెలిసిందే. విజయానికి నిలువెత్తు నిర్వచనంగా చెప్పుకునే రాజమౌళి.. తాజాగా ఒక ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నారు. తన గతాన్ని రివీల్ చేసి షాకిచ్చాడు.
ఈ రోజున ఇంత సక్సెస్ ఫుల్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న.. కొంతకాలం క్రితం భార్య సంపాదన మీద బతికేవాడన్న విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. పెద్దగా చదువుకోని రాజమౌళి.. ఈ రోజున ఎన్నో విద్యా సంస్థలకు ముఖ్య అతిధిగా హాజరవుతూ విద్యార్థులకు తాను చెప్పాలనుకున్న మాటను చెబుతుంటారు.
తనకు చిన్నతనం నుంచి సినిమా ఇండస్ట్రీ తప్పించి మరింకేమీ తెలీదని.. తన ప్రపంచమంతా సినిమానే అని చెప్పారు. చిన్నతనంలో చదువు సరిగా అబ్బలేదని.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండటంతో అన్ని క్రాఫ్ట్సులో పని చేసినట్లు చెప్పారు. ఒక దర్శకుడికి అన్ని క్రాఫ్టుల్లో పట్టు ఉండాలన్న కసితో తాను అన్నీ నేర్చుకున్నట్లు చెప్పారు.
ఒక టైంలో తనకు పైసా సంపాదన లేదని.. అలాంటి వేళ తన భార్య రమా రాజమౌళి జీతం మీదనే తాను బతికినట్లు చెప్పారు. అప్పట్లో తనను ఆమే పోషించినట్లు చెప్పారు. అలా చెప్పుకోవటానికి తనకు సిగ్గేయటం లేదన్న రాజమౌళి.. సంతోషంగా ఉందన్నారు.
తాను దర్శకుడు కాక ముందు ఉన్న పనల్లా.. పొద్దున్నే భార్యను ఆఫీసులో డ్రాప్ చేయటం.. తిరిగి వచ్చి కథలు.. డైలాగ్స్ రాసుకోవటం.. సాయంత్రం ఐదింటికి ఆఫీసుకు వెళ్లి తీసుకొచ్చేవాడినని తన పాత విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. విజేతగా నిలిచే ప్రతి ఒక్కరి వెనుక ఎవరో ఒకరు ఉంటారన్నది ఎంత నిజమో రాజమౌళి మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతుంది.
This post was last modified on November 3, 2021 10:30 am
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…