దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగానే కాదు.. అత్యధికంగా పారితోషికం తీసుకున్న డైరెక్టర్ అన్నంతనే గుర్తుకు వస్తారు ఎస్ఎస్ రాజమౌళి. తన కెరీర్ లో ఇప్పటివరకు తీసిన ఏ మూవీ కూడా పరాజయం కాకుండా ఉన్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం. ఆయన సినిమా అన్నంతనే అందరూ దాని వైపు చూడటమే కాదు.. ఆ ప్రాజెక్టు గంటల వ్యవధిలో క్రేజీగా మారిపోవటం తెలిసిందే. విజయానికి నిలువెత్తు నిర్వచనంగా చెప్పుకునే రాజమౌళి.. తాజాగా ఒక ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నారు. తన గతాన్ని రివీల్ చేసి షాకిచ్చాడు.
ఈ రోజున ఇంత సక్సెస్ ఫుల్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న.. కొంతకాలం క్రితం భార్య సంపాదన మీద బతికేవాడన్న విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. పెద్దగా చదువుకోని రాజమౌళి.. ఈ రోజున ఎన్నో విద్యా సంస్థలకు ముఖ్య అతిధిగా హాజరవుతూ విద్యార్థులకు తాను చెప్పాలనుకున్న మాటను చెబుతుంటారు.
తనకు చిన్నతనం నుంచి సినిమా ఇండస్ట్రీ తప్పించి మరింకేమీ తెలీదని.. తన ప్రపంచమంతా సినిమానే అని చెప్పారు. చిన్నతనంలో చదువు సరిగా అబ్బలేదని.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండటంతో అన్ని క్రాఫ్ట్సులో పని చేసినట్లు చెప్పారు. ఒక దర్శకుడికి అన్ని క్రాఫ్టుల్లో పట్టు ఉండాలన్న కసితో తాను అన్నీ నేర్చుకున్నట్లు చెప్పారు.
ఒక టైంలో తనకు పైసా సంపాదన లేదని.. అలాంటి వేళ తన భార్య రమా రాజమౌళి జీతం మీదనే తాను బతికినట్లు చెప్పారు. అప్పట్లో తనను ఆమే పోషించినట్లు చెప్పారు. అలా చెప్పుకోవటానికి తనకు సిగ్గేయటం లేదన్న రాజమౌళి.. సంతోషంగా ఉందన్నారు.
తాను దర్శకుడు కాక ముందు ఉన్న పనల్లా.. పొద్దున్నే భార్యను ఆఫీసులో డ్రాప్ చేయటం.. తిరిగి వచ్చి కథలు.. డైలాగ్స్ రాసుకోవటం.. సాయంత్రం ఐదింటికి ఆఫీసుకు వెళ్లి తీసుకొచ్చేవాడినని తన పాత విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. విజేతగా నిలిచే ప్రతి ఒక్కరి వెనుక ఎవరో ఒకరు ఉంటారన్నది ఎంత నిజమో రాజమౌళి మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతుంది.
This post was last modified on November 3, 2021 10:30 am
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…