దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అనే మాట సినీ పరిశ్రమలో చాలా వరకు హీరోయిన్లకే వర్తిస్తుంటుంది. వాళ్ల కెరీర్ స్పాన్ తక్కువ కాబట్టి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి, పారితోషకాల విషయంలో రాజీ పడకుండా డిమాండ్కు తగ్గట్లు పుచ్చుకుని సాధ్యమైనంతగా సంపాదించడానికి చూస్తుంటారు. ఈ విషయంలో కొందరు హీరోలు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు.
టాలీవుడ్ విషయానికొస్తే.. క్రేజ్ను క్యాష్ చేసుకోవడంలో రవితేజను మించిన వారు లేరనే పేరుంది. కెరీర్లో తొలి పదేళ్లలో చాలా వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి, నటుడిగా చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకున్న రవితేజ.. కొంచెం లేటుగా హీరోగా నిలదొక్కుకున్నాడు. స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాక అతను అసలిక ఆగలేదు. తన రేంజ్ హీరోలతో పోలిస్తే శరవేగంగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. పారితోషకాల విషయంలో కూడా చాలా నిక్కచ్చిగా ఉంటాడని.. ఒక సినిమా హిట్టవగానే రేటు పెంచేస్తాడని.. అస్సలు రాజీ పడడని రవితేజకు పేరుంది. ఈ విషయంలో మాస్ రాజా కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. అయినా కూడా అతను తగ్గదేలే అన్నట్లుగా వెళ్లిపోతుంటాడు. మధ్యలో కొన్నేళ్లు సరైన విజయం లేక అతడి క్రేజ్ తగ్గింది. అందుకు తగ్గట్లే మార్కెట్, పారితోషకాలు కూడా పడిపోయాయి.
ఐతే ఈ ఏడాది ‘క్రాక్’తో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు మాస్ రాజా. ఇక అంతే.. ఉన్నట్లుండి స్పీడు పెంచేశాడు. దాంతో పాటే పారితోషకం కూడా పెరిగిపోయింది. మళ్లీ తిరిగొచ్చిన తన క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి గట్టి ప్రణాళికలతోనే సాగిపోతున్నాడు.
‘క్రాక్’ తర్వాత ఇప్పటికే ‘ఖిలాడి’, ‘రామారావు’ చిత్రాలను చివరి దశకు తీసుకెళ్లిన రవితేజ.. త్రినాథరావు నక్కిన సినిమాను గత నెలలోనే పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అవి చాలవన్నట్లు మొన్ననే సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అది రవితేజ 70వ సినిమా కాగా.. మంగళవారం రవితేజ 71వ చిత్రం గురించి హింట్ ఇచ్చారు. బుధవారం ఈ సినిమా గురించి ప్రకటన ఉంటుందట. మాస్ రాజా చేయబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. దర్శకుడెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.
This post was last modified on November 2, 2021 3:33 pm
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా…
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగే సంపాదించాడు శ్రీ విష్ణు. గత ఏడాది అతడి నుంచి…