మిల్కీబ్యూటీ తమన్నా ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడానికి అఫీషియల్ గా అగ్రిమెంట్ పై సైన్ చేసింది. కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆమెకి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేయడానికి నిర్మాతలకు రెండు నెలల సమయం పట్టింది. రీసెంట్ గానే తమన్నా ఈ సినిమాలో అఫీషియల్ గా ఆన్ బోర్డ్ అయింది. కొన్నిరోజుల్లో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో తమన్నా నటించింది. కానీ తెరపై వీరి కాంబినేషన్ పై విమర్శలు వినిపించాయి. చిరు బాగా లావుగా కనిపించడంతో.. ఆయన పక్కన తమన్నా సూట్ అవ్వలేదు. దీంతో రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ జంటను చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించింది. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి ఆమెనే రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి మొదలుకానుంది. జనవరి నెల నుంచి తమన్నా సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తమన్నాను మరో సీనియర్ హీరో సినిమా కోసం నటించమని అడుగుతున్నారట. రెగ్యులర్ సినిమాల కంటే సీనియర్ హీరోలతో కలిసి నటించే సినిమాల కోసం అమ్మడు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…