మిల్కీబ్యూటీ తమన్నా ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడానికి అఫీషియల్ గా అగ్రిమెంట్ పై సైన్ చేసింది. కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆమెకి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేయడానికి నిర్మాతలకు రెండు నెలల సమయం పట్టింది. రీసెంట్ గానే తమన్నా ఈ సినిమాలో అఫీషియల్ గా ఆన్ బోర్డ్ అయింది. కొన్నిరోజుల్లో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో తమన్నా నటించింది. కానీ తెరపై వీరి కాంబినేషన్ పై విమర్శలు వినిపించాయి. చిరు బాగా లావుగా కనిపించడంతో.. ఆయన పక్కన తమన్నా సూట్ అవ్వలేదు. దీంతో రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ జంటను చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించింది. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి ఆమెనే రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి మొదలుకానుంది. జనవరి నెల నుంచి తమన్నా సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తమన్నాను మరో సీనియర్ హీరో సినిమా కోసం నటించమని అడుగుతున్నారట. రెగ్యులర్ సినిమాల కంటే సీనియర్ హీరోలతో కలిసి నటించే సినిమాల కోసం అమ్మడు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.
This post was last modified on November 1, 2021 2:33 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…