మిల్కీబ్యూటీ తమన్నా ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడానికి అఫీషియల్ గా అగ్రిమెంట్ పై సైన్ చేసింది. కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆమెకి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేయడానికి నిర్మాతలకు రెండు నెలల సమయం పట్టింది. రీసెంట్ గానే తమన్నా ఈ సినిమాలో అఫీషియల్ గా ఆన్ బోర్డ్ అయింది. కొన్నిరోజుల్లో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో తమన్నా నటించింది. కానీ తెరపై వీరి కాంబినేషన్ పై విమర్శలు వినిపించాయి. చిరు బాగా లావుగా కనిపించడంతో.. ఆయన పక్కన తమన్నా సూట్ అవ్వలేదు. దీంతో రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ జంటను చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించింది. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి ఆమెనే రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి మొదలుకానుంది. జనవరి నెల నుంచి తమన్నా సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తమన్నాను మరో సీనియర్ హీరో సినిమా కోసం నటించమని అడుగుతున్నారట. రెగ్యులర్ సినిమాల కంటే సీనియర్ హీరోలతో కలిసి నటించే సినిమాల కోసం అమ్మడు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.
This post was last modified on November 1, 2021 2:33 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…