ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలిద్దరూ కలవడమే పెద్ద సర్ప్రైజ్ అంటే.. వాళ్లని రాజమౌళి డైరెక్ట్ చేయడం మరో పెద్ద సర్ప్రైజ్. ఇలాంటి ఎన్నో సర్ప్రైజులతో ‘ఆర్ఆర్ఆర్’ని స్టార్ట్ చేసిన టీమ్.. ఆ తర్వాత ప్రతి అప్డేట్తోను సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. రీసెంట్గా మరో సర్ప్రైజ్ను కూడా రెడీ చేశారు. దానికి సంబంధించిన ప్రకటన శుక్రవారం రావాల్సి ఉంది. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణంతో అనౌన్స్మెంట్ను వాయిదా వేశారు. ఆ అప్డేట్ను ఇవాళ రిలీజ్ చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ గ్లింప్స్ను నవంబర్ 1న ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. నలభై అయిదు సెకన్ల పాటు సాగే ఈ వీడియో మామూలుగా ఉండదంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, తారక్ల పాత్రల్ని పరిచయం చేస్తూ విడుదలైన టీజర్లు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి ఇద్దరినీ కలిపి చూపించే గ్లింప్స్ రాబోతోంది. ఇది మామూలు ట్రీట్ కాదు అభిమానులకి.
సంక్రాంతి కానుకగా జనవరి 7న రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ ప్లాన్ ఉంది రాజమౌళికి. సినిమాని ఆయన మార్కెట్ చేస్తున్న విధానం కూడా అందరినీ అబ్బురపరుస్తోంది. రీసెంట్గా పీవీఆర్ సినిమాతో చేతులు కలిపారు మేకర్స్. తమ మల్టీప్లెక్సులన్నింటి పేర్లనీ పీవీఆర్ఆర్ఆర్గా మార్చేసిందా సంస్థ. మూవీ రిలీజయ్యే వరకు ఇది ఇలాగే కొనసాగనుంది. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదో రికార్డ్. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఇంకెన్ని రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో.
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…
ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం నుంచి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం దాదాపుగా బయటికి వచ్చేసింది. ట్రైలర్,…