ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలిద్దరూ కలవడమే పెద్ద సర్ప్రైజ్ అంటే.. వాళ్లని రాజమౌళి డైరెక్ట్ చేయడం మరో పెద్ద సర్ప్రైజ్. ఇలాంటి ఎన్నో సర్ప్రైజులతో ‘ఆర్ఆర్ఆర్’ని స్టార్ట్ చేసిన టీమ్.. ఆ తర్వాత ప్రతి అప్డేట్తోను సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. రీసెంట్గా మరో సర్ప్రైజ్ను కూడా రెడీ చేశారు. దానికి సంబంధించిన ప్రకటన శుక్రవారం రావాల్సి ఉంది. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణంతో అనౌన్స్మెంట్ను వాయిదా వేశారు. ఆ అప్డేట్ను ఇవాళ రిలీజ్ చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ గ్లింప్స్ను నవంబర్ 1న ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. నలభై అయిదు సెకన్ల పాటు సాగే ఈ వీడియో మామూలుగా ఉండదంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, తారక్ల పాత్రల్ని పరిచయం చేస్తూ విడుదలైన టీజర్లు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి ఇద్దరినీ కలిపి చూపించే గ్లింప్స్ రాబోతోంది. ఇది మామూలు ట్రీట్ కాదు అభిమానులకి.
సంక్రాంతి కానుకగా జనవరి 7న రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ ప్లాన్ ఉంది రాజమౌళికి. సినిమాని ఆయన మార్కెట్ చేస్తున్న విధానం కూడా అందరినీ అబ్బురపరుస్తోంది. రీసెంట్గా పీవీఆర్ సినిమాతో చేతులు కలిపారు మేకర్స్. తమ మల్టీప్లెక్సులన్నింటి పేర్లనీ పీవీఆర్ఆర్ఆర్గా మార్చేసిందా సంస్థ. మూవీ రిలీజయ్యే వరకు ఇది ఇలాగే కొనసాగనుంది. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదో రికార్డ్. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఇంకెన్ని రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…