కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ చనిపోయి 24 గంటలు దాటిపోయింది. ఇంకా ఆ వార్తను అభిమానులు నమ్మలేకపోతున్నారు. కాలం కొంచెం వెనక్కి వెళ్లిపోయి.. పునీత్కు ఏమీ కాకపోతే.. అతను ఎప్పట్లాగే మన మధ్య తిరిగిగే బాగుండే అనుకుంటున్నారు. నటుడిగానే కాక వ్యక్తిగానూ కోట్లమందికి స్ఫూర్తినిచ్చిన.. గొప్ప వ్యక్తిత్వం, సేవా భావం కలిగిన వ్యక్తి ఇలా హఠాత్తుగా ప్రాణాలు విడవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
సామాన్య అభిమానులే కాదు.. సెలబ్రెటీలు సైతం పునీత్ మృతితో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. పునీత్ కన్నడిగుడే కానీ.. తెలుగు వారితో పరోక్షంగా అతడికి మంచి అనుబంధమే ఉంది. మన స్టార్లలో చాలామందికి అతడికి సన్నిహితుడు. ముఖ్యంగా నందమూరి కుటుంబంతో అతడికి మంచి అనుబంధం ఉంది. బాలయ్యను అన్నయ్యలా, తారక్ను తమ్ముడిలా భావిస్తాడతను.
ఈ నేపథ్యంలోనే బాలయ్య, తారక్ ఇద్దరూ పునీత్ కడసారి చూపు కోసం బెంగళూరుకు వెళ్లారు. బాలయ్య.. పునీత్ పార్థివ దేహాన్ని సందర్శిస్తున్నప్పటి వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. పునీత్ అన్నయ్య బాలయ్యను తోడ్కొని వెళ్తున్న వీడియో ఒకటి ఇప్పుడు అందరినీ కలచి వేస్తోంది. ఎప్పుడు నవ్వుతూ లేదంటే గంభీరంగా కనిపించే బాలయ్య.. ఏడుస్తున్న దృశ్యం ఈ వీడియోలో కనిపించింది. అలా ఏడుస్తూనే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం అన్నట్లుగా చేతితో సంజ్ఞ చేస్తూ అయ్యో అని బాలయ్య తల కొట్టుకోవడం వీడియోలో కనిపించింది. పక్కనే ఉన్న శివరాజ్ కుమార్ కళ్లల్లోనూ నీళ్లు కనిపించాయి. ఈ వీడియో అందరినీ కదిలించేస్తోంది.
గతంలో ‘యన్.టి.ఆర్’ సినిమా ప్రమోషన్ల కోసం బాలయ్య బెంగళూరుకు వెళ్లగా.. ఆ వేడుకలో శివరాజ్, పునీత్ పాల్గొన్నారు. వేదిక మీద బాలయ్య పక్కనే కూర్చున్న పునీత్.. కర్చీఫ్తో బాలయ్య ముఖం మీద తుడుస్తున్న వీడియో.. అలాగే స్పీచ్ ఇస్తూ బాలయ్యను బాలన్న అని సంబోధిస్తూ ఆయన కుటుంబం అంటే తన కుటుంబం లాగే అన్న వీడియో నిన్నట్నుంచి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పునీత్ కోసం బాలయ్య ఏడుస్తున్న వీడియో కూడా అలాగే వైరల్ అవుతోంది.
This post was last modified on October 30, 2021 1:10 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…