డ్రగ్స్ కేసులో అరెస్టైన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. దాదాపు నాలుగు వారాలు జైలు గోడల మధ్య గడిపాడు. తనని బైటికి తీసుకు రావడానికి షారుఖ్ దంపతులు చేసిన ప్రయత్నాలు చాలాసార్లు బెడిసికొట్టాయి. ఎట్టకేలకి ఇప్పటికి బెయిల్ దొరికింది. అయితే బెయిల్ దొరికినా ఆర్యన్కి ఇప్పుడప్పుడే స్వేచ్ఛ మాత్రం దొరికే చాన్స్ లేదు. ఎందుకంటే కట్టుదిట్టమైన పద్నాలుగు ఆంక్షలతో అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది.
లక్షరూపాయలతో పాటు ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పూచీకత్తు మీద ఇచ్చిన ఈ బెయిల్లో ఉన్న నియమాలు ఏంటంటే.. ప్రత్యేక కోర్టు అనుమతి లేకుండా ఆర్యన్ దేశం వదిలి వెళ్లడానికి వీల్లేదు. తన పాస్పోర్టును సరెండర్ చేసేయాలి. చివరికి ముంబై దాటి బైటికి వెళ్లాలన్నా దర్యాప్తు అధికారి అనుమతి కావాలి. బైటికి వెళ్తున్నానని చెబితే సరిపోదు, ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో కూడా వివరంగా చెప్పాలి. కేసు విచారణను అడ్డుకునే ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు. సాక్ష్యుల్ని, ఆధారాల్ని ప్రభావితం చేయకూడదు.
అలాగే నిందితుల్లో ఒకడైన తన ఫ్రెండ్ అర్బాజ్ మర్చంట్తో పాటు మరే నిందితుడితోనూ మాట్లాడటానికి వీల్లేదు. కేసు గురించి మీడియాతో మాట్లాడటానికి కూడా వీల్లేదు. ఎన్సీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా రావాలి. ప్రతి శుక్రవారం పదకొండు నుంచి రెండు గంటల మధ్య ఎన్సీబీ ఆఫీసులో కచ్చితంగా హాజరవ్వాలి. ఒక్కటి కూడా మిస్సవకుండా ప్రతి కోర్టు విచారణకీ హాజరవ్వాలి. విచారణ ఆలస్యమయ్యేలా ఎలాంటి ప్లాన్లూ వేయకూడదు. అన్నిటింకంటే ముఖ్యంగా తను డ్రగ్స్కి పూర్తి దూరంగా ఉండాలి.
ఈ కండిషన్స్ అన్నీ సరిగ్గా ఫాలో అయితేనే ఆర్యన్ బైట ఉంటాడు. దేన్ని మీరినా మళ్లీ అరెస్ట్ చేసే అధికారం ఎన్సీబీకి ఉంటుంది. ఇక షారుఖ్ కూడా కొడుకు విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు ఆర్యన్ బైటికి రాడని, తనని కదిలించే ప్రయత్నం చేయవద్దని ఆల్రెడీ సన్నిహితులు, బంధువులదరికీ చెప్పేశాడట. ఆర్యన్ని డ్రగ్స్కి దూరం చేసేందుకు ఇంట్లోనే కౌన్సెలింగులవీ ఇప్పించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ చెడు అలవాటు నుంచి, ఈ కేసు నుంచి ఆర్యన్ ఎప్పటికి బయటపడతాడో చూడాలి.
This post was last modified on October 30, 2021 12:58 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…