Movie News

శంకర్‌‌కి లైన్ క్లియర్

సినిమాలతో దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకునే శంకర్.. ఇండియన్ కారణంగా వివాదాలతో వార్తల్లోకెక్కాడు. ఆ సినిమా విషయంలో శంకర్‌‌కి, నిర్మాణ సంస్థ లైకాకి మధ్య సమస్యలు తలెత్తాయి. విషయం కోర్టు మెట్లెక్కింది. దాంతో ఆ సినిమా భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యింది. కానీ ఇప్పుడా సమస్య తీరిపోయిందట. శంకర్‌‌, లైకాల మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది.

ఇండియన్‌ 2 సెట్‌లో యాక్సిడెంట్ అయ్యి కొందరు చనిపోవడంతో సినిమాకి బ్రేక్ పడింది. కేసులు, కోర్టులంటూ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఈలోపు శంకర్‌‌ ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌ని అనౌన్స్ చేయడంతో అలా ఎలా కుదురుతుంది, ముందు తమ సినిమాని పూర్తి చేయమంటూ నిర్మాణ సంస్థ లైకా గొడవకు దిగింది. కానీ శంకర్ తగ్గలేదు. సినిమా లేటవడానికి తాను కారణం కాదని, నిర్మాతలదే బాధ్యతని అన్నాడు. ఆ సమస్య తేలకముందే రామ్‌చరణ్‌తో కూడా మూవీని అనౌన్స్ చేశాడు. త్వరలో సెట్స్‌కి తీసుకెళ్లబోతున్నాడు కూడా.

దాంతో లైకా సంస్థ మరింత పట్టుబట్టింది. తమ సినిమాని పూర్తి చేశాకే మిగతా సినిమాలు చేయాలని మొండికేసింది. కమల్ హాసన్ స్వయంగా కల్పించుకున్నా శంకర్‌‌కి, లైకాకి మధ్య సమన్వయం కుదరలేదు. అయితే రీసెంట్‌గా జరిగిన హియరింగ్‌లో కోర్టు ఓ సలహా ఇచ్చింది. ఇరు వర్గాల వైపు సాక్ష్యాలు బలంగానే ఉన్నాయని, దీన్ని రచ్చ చేసుకోకుండా ఓ ఒప్పందానికి వస్తే మంచిదని చెప్పింది. అంటే మీ గొడవ మీరే తేల్చుకోండి అని చెప్పిందన్నమాట.

న్యాయస్థానమే అలా చెప్పాక ఇక చేసేదేముంది.. శంకర్‌‌తో లైకా ఒప్పందం చేసుకోడానికి ముందుకొచ్చింది. వీలైనంత త్వరగా ఆ రెండు సినిమాలూ కంప్లీట్ చేసి, తమ సినిమాని తిరిగి సెట్స్‌కి తీసుకెళ్లాలని.. ఎక్కువ లేట్‌ చేయకుండా మూవీని పూర్తి చేసెయ్యాలని చెప్పిందట. తాను కూడా మొదట్నుంచీ అదే చెబుతున్నానని, ఆ రెండూ అయ్యాక ఈ సినిమాని పూర్తి చేయడానికి నాకేం అభ్యంతరం లేదని శంకర్ కూడా అన్నాడట. దాంతో ఇండియన్‌ 2 వివాదానికి తెర పడినట్టేనని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

This post was last modified on October 29, 2021 11:31 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago