సినిమాలతో దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకునే శంకర్.. ఇండియన్ కారణంగా వివాదాలతో వార్తల్లోకెక్కాడు. ఆ సినిమా విషయంలో శంకర్కి, నిర్మాణ సంస్థ లైకాకి మధ్య సమస్యలు తలెత్తాయి. విషయం కోర్టు మెట్లెక్కింది. దాంతో ఆ సినిమా భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యింది. కానీ ఇప్పుడా సమస్య తీరిపోయిందట. శంకర్, లైకాల మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది.
ఇండియన్ 2 సెట్లో యాక్సిడెంట్ అయ్యి కొందరు చనిపోవడంతో సినిమాకి బ్రేక్ పడింది. కేసులు, కోర్టులంటూ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఈలోపు శంకర్ ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ని అనౌన్స్ చేయడంతో అలా ఎలా కుదురుతుంది, ముందు తమ సినిమాని పూర్తి చేయమంటూ నిర్మాణ సంస్థ లైకా గొడవకు దిగింది. కానీ శంకర్ తగ్గలేదు. సినిమా లేటవడానికి తాను కారణం కాదని, నిర్మాతలదే బాధ్యతని అన్నాడు. ఆ సమస్య తేలకముందే రామ్చరణ్తో కూడా మూవీని అనౌన్స్ చేశాడు. త్వరలో సెట్స్కి తీసుకెళ్లబోతున్నాడు కూడా.
దాంతో లైకా సంస్థ మరింత పట్టుబట్టింది. తమ సినిమాని పూర్తి చేశాకే మిగతా సినిమాలు చేయాలని మొండికేసింది. కమల్ హాసన్ స్వయంగా కల్పించుకున్నా శంకర్కి, లైకాకి మధ్య సమన్వయం కుదరలేదు. అయితే రీసెంట్గా జరిగిన హియరింగ్లో కోర్టు ఓ సలహా ఇచ్చింది. ఇరు వర్గాల వైపు సాక్ష్యాలు బలంగానే ఉన్నాయని, దీన్ని రచ్చ చేసుకోకుండా ఓ ఒప్పందానికి వస్తే మంచిదని చెప్పింది. అంటే మీ గొడవ మీరే తేల్చుకోండి అని చెప్పిందన్నమాట.
న్యాయస్థానమే అలా చెప్పాక ఇక చేసేదేముంది.. శంకర్తో లైకా ఒప్పందం చేసుకోడానికి ముందుకొచ్చింది. వీలైనంత త్వరగా ఆ రెండు సినిమాలూ కంప్లీట్ చేసి, తమ సినిమాని తిరిగి సెట్స్కి తీసుకెళ్లాలని.. ఎక్కువ లేట్ చేయకుండా మూవీని పూర్తి చేసెయ్యాలని చెప్పిందట. తాను కూడా మొదట్నుంచీ అదే చెబుతున్నానని, ఆ రెండూ అయ్యాక ఈ సినిమాని పూర్తి చేయడానికి నాకేం అభ్యంతరం లేదని శంకర్ కూడా అన్నాడట. దాంతో ఇండియన్ 2 వివాదానికి తెర పడినట్టేనని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on October 29, 2021 11:31 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…