ఇప్పటిదాకా చూడని.. ఎప్పుడూ వినని కలయిక అంటూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి దాని బృందం సోషల్ మీడియాలో చేసిన ప్రకటన చూసి అందరూ తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. ఈ శుక్రవారమే దీని గురించి ప్రకటన రాబోతోందని కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు ఏమిటీ కొలాబరేషన్ అంటూ గెస్సింగ్లో పడిపోయారు. ఈ సినిమాకు సంబంధించి దేశీయంగా అన్ని బిజినెస్ డీల్స్ పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత డీవీవీ దానయ్య లోకల్ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తమిళనాట లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఉత్తరాదిన పెన్ మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి రానున్న ప్రకటన ఈ చిత్ర అంతర్జాతీయ హక్కులకు సంబంధించినదే అని సమాచారం.
ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో రిలీజ్ చేయబోతోందని.. దాని గురించే ప్రకటన రాబోతోందని టాలీవుడ్లో డిస్కషన్ నడుస్తోంది. వార్నర్ బ్రదర్స్ నిర్మించే హాలీవుడ్ సినిమాలను మన డిస్ట్రిబ్యూటర్లు ఇండియాలో రిలీజ్ చేయడమే చూశాం కానీ.. మన సినిమాలను ప్రపంచ స్థాయిలో వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేయడం గురించి ఎప్పుడూ ఊహ కూడా లేదు.
నిజంగా ఈ ప్రచారం నిజమే అయితే మాత్రం మన రాజమౌళి మరిన్ని మెట్లు పైకి ఎక్కేసినట్లే. ఇండియన్ సినిమాను కూడా కొన్ని మెట్లు ఎక్కించినట్లే. ‘బాహుబలి’ బ్రాండ్ ‘ఆర్ఆర్ఆర్’కు బాగానే ఉపయోగపడుతోందనడానికి ఇది రుజువు. ‘బాహుబలి’ వివిధ దేశాల్లో చాలా బాగా ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు చర్చనీయాంశం అయ్యేలా చేసింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కు ఈ స్థాయి క్రేజ్, బిజినెస్ డీల్స్ వస్తున్నాయన్నా అది రాజమౌళి క్రెడిటే.
This post was last modified on October 29, 2021 7:40 am
పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…