టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ ‘మొహంజదారో’ సినిమా రూపంలో ఆమెకి పెద్ద డిజాస్టర్ ఎదురైంది. ఆ తరువాత తెలుగులో ‘డీజే’ సినిమాలో నటించి.. ఓ రేంజ్ లో గ్లామర్ ఎక్స్ పోజ్ చేసి తొలి హిట్టు అందుకుంది. ఇక ఆ సినిమా తరువాత పూజాహెగ్డే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుస హిట్స్ తో బిజీ స్టార్ గా మారింది.
సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇదిలా ఉండగా.. అందరిలానే పూజాకి కూడా సొంతింటి కల ఉంది. ఇప్పుడు దాన్ని నెరవేర్చుకునే పనిలో పడింది. ముంబైలో ఓ పోష్ ఏరియాలో ఇల్లు కొనుక్కుంది పూజాహెగ్డే. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. పెయింటింగ్ వర్క్స్ ను పరిశీలిస్తూ కొన్ని ఫోటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.
ఈ ఫోటోలకు ‘బిల్డింగ్ మై డ్రీమ్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ఇంటి పనులను తనకంటే తన తల్లి ఎక్కువగా చూసుకుంటుందని పూజా చెప్పుకొచ్చింది. సౌత్ ఇండియాకు చెందిన పూజాహెగ్డే ఫ్యామిలీ వృత్తిరీత్యా ముంబైలో సెటిల్ అయింది. ఇప్పుడు మన బుట్టబొమ్మ తన కోసం తన ఫ్యామిలీ కోసం ఓ లావిష్ ఇంటిని రెడీ చేస్తోంది. త్వరలోనే వీరంతా కొత్తింట్లోకి షిఫ్ట్ కానున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తమిళంలో ‘బీస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ.
This post was last modified on October 27, 2021 8:42 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…