టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ ‘మొహంజదారో’ సినిమా రూపంలో ఆమెకి పెద్ద డిజాస్టర్ ఎదురైంది. ఆ తరువాత తెలుగులో ‘డీజే’ సినిమాలో నటించి.. ఓ రేంజ్ లో గ్లామర్ ఎక్స్ పోజ్ చేసి తొలి హిట్టు అందుకుంది. ఇక ఆ సినిమా తరువాత పూజాహెగ్డే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుస హిట్స్ తో బిజీ స్టార్ గా మారింది.
సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇదిలా ఉండగా.. అందరిలానే పూజాకి కూడా సొంతింటి కల ఉంది. ఇప్పుడు దాన్ని నెరవేర్చుకునే పనిలో పడింది. ముంబైలో ఓ పోష్ ఏరియాలో ఇల్లు కొనుక్కుంది పూజాహెగ్డే. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. పెయింటింగ్ వర్క్స్ ను పరిశీలిస్తూ కొన్ని ఫోటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.
ఈ ఫోటోలకు ‘బిల్డింగ్ మై డ్రీమ్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ఇంటి పనులను తనకంటే తన తల్లి ఎక్కువగా చూసుకుంటుందని పూజా చెప్పుకొచ్చింది. సౌత్ ఇండియాకు చెందిన పూజాహెగ్డే ఫ్యామిలీ వృత్తిరీత్యా ముంబైలో సెటిల్ అయింది. ఇప్పుడు మన బుట్టబొమ్మ తన కోసం తన ఫ్యామిలీ కోసం ఓ లావిష్ ఇంటిని రెడీ చేస్తోంది. త్వరలోనే వీరంతా కొత్తింట్లోకి షిఫ్ట్ కానున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తమిళంలో ‘బీస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ.
This post was last modified on October 27, 2021 8:42 pm
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…