ప్రభాస్లో అందరికీ నచ్చే గుణం.. అతడి అణకువే. కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నాడో.. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాక కూడా అతను అలాగే ఉన్నాడు. ఎలాంటి దర్పం, గర్వం చూపించకుండా ఇప్పటికీ చాలా హంబుల్గా కనిపిస్తుంటాడతను.
సోషల్ మీడియా ప్రభాస్ అభిమానులు అతి చేస్తుంటారు కానీ.. అతను మాత్రం తన రేంజ్ పెరిగిపోయిందని, తాను గొప్ప అనే విధంగా ప్రవర్తించడు. మామూలు వ్యక్తిలాగే మాట్లాడతాడు. అవతలి వాళ్ల స్థాయి చూడకుండా వారితో క్యాజువల్గా ఉంటాడు.
తాను మిడ్ రేంజ్ హీరోగా ఉన్నపుడు.. తన స్టేటస్ను పక్కన పెట్టి బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ప్రభాస్కు చాలా ఇష్టం. ఆ రెండు చిత్రాలూ అనుకున్నంతగా ఆడకపోయినా.. నటుడిగా తన ఎదుగుదలకు తోడ్పడటం.. తన కెరీర్లో అవి భిన్నమైన చిత్రాలుగా నిలవడంతో పూరి మీద ప్రత్యేక అభిమానం ఉంది ప్రభాస్కు.
ఆ అభిమానంతోనే పూరి కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు ప్రభాస్. ముంబయిలో షూటింగ్లో బిజీగా ఉన్న అతను.. ‘రొమాంటిక్’ కోసం బ్రేక్ తీసుకుని ఒక రోజు మొత్తాన్ని కేటాయించాడు. తన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడమే కాదు.. హీరో హీరోయిన్లు ఆకాశ్, కేతిక శర్మలతో ఒక చిట్ చాట్ కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు.
అందులో ‘రొమాంటిక్’ సినిమా గురించి తనే వాళ్లిద్దరినీ ఇంటర్వ్యూ కూడా చేశాడు. చాలా సరదాగా సాగిపోయిన ఈ ఇంటర్వ్యూలో ఒక చోట కేతిక శర్మ తనను తాను ప్రభాస్కు పరిచయం చేసుకుంది. హాయ్ సర్ ఐయామ్ కేతిక ఫ్రమ్ న్యూ ఢిల్లీ అంది. దీనికి ప్రభాస్ బదులిస్తూ.. ‘హాయ్ మేడమ్.. ఐయామ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూరు’ అనడం ఈ వీడియోకు హైలైట్.
ప్రభాస్ స్థాయి వ్యక్తి ఇలా అనడం అందరినీ ఆకట్టుకుంది. దానికి బదులుగా కేతిక షాకై.. మీరు బాహుబలి సర్, మీ గురించి మీరు పరిచయం చేసుకోవడం ఏంటి.. మీరు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అంటూ ఇబ్బంది పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ను అందరూ డార్లింగ్ అనేది ఇందుకే అంటూ అతన్ని పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.
This post was last modified on October 27, 2021 3:35 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…