పూరి ఆకాశ్ అంటే ఏమో అనుకున్నారు కానీ.. మొన్న తన కొత్త చిత్రం రొమాంటిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన ప్రసంగం చూశాక చాలామందికి అతడి మీద అభిప్రాయం మారిపోయింది. తండ్రి పూరి జగన్నాథ్కు ఏమాత్రం తగ్గని రీతిలో పంచ్ పవర్కు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ స్పీచ్ ఇచ్చి అందరి నోళ్లలో నానాడీ కుర్రాడు.
టీనేజీలో ఉండగా చేసిన ఆంధ్రా పోరి, ఆ తర్వాత పూర్తి స్థాయి హీరోగా మారి నటించిన మెహబూబా చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేయగా.. ఇప్పుడు ఆకాశ్ ఆశలన్నీ రొమాంటిక్ మూవీ మీదే ఉన్నాయి. పూరి స్క్రిప్టుతో ఆయన శిష్యుడు అనిల్ పాడూరి రూపొందించిన సినిమా ఇది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియాను కలిసిన ఆకాశ్.. రొమాంటిక్ సినిమా విషయంలో తాను చాలా భయపడినట్లు వెల్లడించాడు.
తన కెరీర్కు చాలా అవసరమైన సినిమా కావడంతో దీన్ని ఓకే చేయడానికి టైం తీసుకున్నానని.. అలాగే సినిమా చేయాలనుకున్నాక పట్టాలెక్కడానికి ఇంకొంత ఆలస్యం అయిందని.. ఆ తర్వాత కరోనా వల్ల సినిమా మరింత లేట్ అయిందని ఆకాశ్ చెప్పాడు. ఐతే కరోనా టైంలో ఈ సినిమా ఎక్కడ ఓటీటీకి వెళ్లిపోతుందో అని తాను తెగ భయపడిపోయినట్లు ఆకాశ్ వెల్లడించాడు. రొమాంటిక్ పక్కాగా థియేటర్లలో విజిల్స్ మధ్య ఎంజాయ్ చేసే సినిమా అని.. ఇలాంటి సినిమాను ఓటీటీలో చూస్తే కిక్కుండదని ఆకాశ్ వ్యాఖ్యానించాడు.
రొమాంటిక్ కచ్చితంగా పెద్ద హిట్టవుతుందన్న ఆకాశ్.. ఈ సినిమా ఫలితం చూశాక కొత్త సినిమాల గురించి ఆలోచిస్తానని చెప్పాడు. జార్జిరెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో తాను నటిస్తున్న చోర్ బజార్ సినిమా దాదాపుగా పూర్తయిందని.. అదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాడు ఆకాశ్.
This post was last modified on October 27, 2021 8:12 am
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ…
పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా…
రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో…
క్రేజ్ పరంగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్ పుష్ప, సలార్ లతో పోటీపడే స్థాయిలో బజ్ తెచ్చుకున్న కాంతార 2 షూటింగ్…
టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్…
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…