పూరి ఆకాశ్ అంటే ఏమో అనుకున్నారు కానీ.. మొన్న తన కొత్త చిత్రం రొమాంటిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన ప్రసంగం చూశాక చాలామందికి అతడి మీద అభిప్రాయం మారిపోయింది. తండ్రి పూరి జగన్నాథ్కు ఏమాత్రం తగ్గని రీతిలో పంచ్ పవర్కు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ స్పీచ్ ఇచ్చి అందరి నోళ్లలో నానాడీ కుర్రాడు.
టీనేజీలో ఉండగా చేసిన ఆంధ్రా పోరి, ఆ తర్వాత పూర్తి స్థాయి హీరోగా మారి నటించిన మెహబూబా చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేయగా.. ఇప్పుడు ఆకాశ్ ఆశలన్నీ రొమాంటిక్ మూవీ మీదే ఉన్నాయి. పూరి స్క్రిప్టుతో ఆయన శిష్యుడు అనిల్ పాడూరి రూపొందించిన సినిమా ఇది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియాను కలిసిన ఆకాశ్.. రొమాంటిక్ సినిమా విషయంలో తాను చాలా భయపడినట్లు వెల్లడించాడు.
తన కెరీర్కు చాలా అవసరమైన సినిమా కావడంతో దీన్ని ఓకే చేయడానికి టైం తీసుకున్నానని.. అలాగే సినిమా చేయాలనుకున్నాక పట్టాలెక్కడానికి ఇంకొంత ఆలస్యం అయిందని.. ఆ తర్వాత కరోనా వల్ల సినిమా మరింత లేట్ అయిందని ఆకాశ్ చెప్పాడు. ఐతే కరోనా టైంలో ఈ సినిమా ఎక్కడ ఓటీటీకి వెళ్లిపోతుందో అని తాను తెగ భయపడిపోయినట్లు ఆకాశ్ వెల్లడించాడు. రొమాంటిక్ పక్కాగా థియేటర్లలో విజిల్స్ మధ్య ఎంజాయ్ చేసే సినిమా అని.. ఇలాంటి సినిమాను ఓటీటీలో చూస్తే కిక్కుండదని ఆకాశ్ వ్యాఖ్యానించాడు.
రొమాంటిక్ కచ్చితంగా పెద్ద హిట్టవుతుందన్న ఆకాశ్.. ఈ సినిమా ఫలితం చూశాక కొత్త సినిమాల గురించి ఆలోచిస్తానని చెప్పాడు. జార్జిరెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో తాను నటిస్తున్న చోర్ బజార్ సినిమా దాదాపుగా పూర్తయిందని.. అదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాడు ఆకాశ్.
This post was last modified on October 27, 2021 8:12 am
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…