Movie News

డ్రగ్స్ కేసు.. అనన్య పాండేకు మరోసారి నోటీసులు!

డ్రగ్స్ కేసు విషయంలో ఇప్పటికే హీరోయిన్ అనన్య పాండేను రెండుసార్లు విచారించగా.. ఇప్పుడు మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు. ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్ ఖాన్ ఫోన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అనన్య పాండేతో అతడు జరిపిన వాట్సాప్ చాట్స్ ను గుర్తించారు. ఆ చాట్ లో డ్రగ్స్ ప్రస్తావన ఉండడంతో అనన్య పాండే ఇంట్లో సోదాలు జరిపి.. ఆమె గాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

దశలవారీగా ఆమెని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆమె తనపై వస్తోన్న ఆరోపణలను ఖండించింది. డ్రగ్స్ కి సంబంధించి ఆర్యన్ తో తను జోక్ మాత్రమే చేశానని.. అంతకుమించి తనకేం తెలియదని ఎన్సీబీ అధికారుల ముందు చెప్పింది. అయితే ఆర్యన్ కు డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి వివరాల గురించి అనన్యకు తెలిసే ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు.

అనన్య ఈ వారంలోనే మరోసారి విచారణ కోసం ఎన్సీబీ ఆఫీస్ కు రాబోతుంది. లెక్కప్రకారం.. నిన్న ఆమె ఎన్సీబీ విచారణకు రావాలి. కానీ తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఎన్సీబీ అధికారులకు సందేశం అందించింది. దీన్ని అంగీకరించిన అధికారులు.. ఆమెకి ఫ్రెష్ గా మరోసారి నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్సీబీ జోనర్ డైరెక్టర్ సమీర్ వాఖండే కూడా ముంబైలో లేరు. ఆయన ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. మరోపక్క ఆర్యన్ బెయిల్ కి సంబంధించి ఈరోజు ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. మరి ఈసారైనా అతడికి బెయిల్ వస్తుందేమో చూడాలి!

This post was last modified on October 26, 2021 12:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

9 minutes ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

2 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

5 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

6 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

6 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

6 hours ago