Movie News

డ్రగ్స్ కేసు.. అనన్య పాండేకు మరోసారి నోటీసులు!

డ్రగ్స్ కేసు విషయంలో ఇప్పటికే హీరోయిన్ అనన్య పాండేను రెండుసార్లు విచారించగా.. ఇప్పుడు మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు. ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్ ఖాన్ ఫోన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అనన్య పాండేతో అతడు జరిపిన వాట్సాప్ చాట్స్ ను గుర్తించారు. ఆ చాట్ లో డ్రగ్స్ ప్రస్తావన ఉండడంతో అనన్య పాండే ఇంట్లో సోదాలు జరిపి.. ఆమె గాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

దశలవారీగా ఆమెని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆమె తనపై వస్తోన్న ఆరోపణలను ఖండించింది. డ్రగ్స్ కి సంబంధించి ఆర్యన్ తో తను జోక్ మాత్రమే చేశానని.. అంతకుమించి తనకేం తెలియదని ఎన్సీబీ అధికారుల ముందు చెప్పింది. అయితే ఆర్యన్ కు డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి వివరాల గురించి అనన్యకు తెలిసే ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు.

అనన్య ఈ వారంలోనే మరోసారి విచారణ కోసం ఎన్సీబీ ఆఫీస్ కు రాబోతుంది. లెక్కప్రకారం.. నిన్న ఆమె ఎన్సీబీ విచారణకు రావాలి. కానీ తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఎన్సీబీ అధికారులకు సందేశం అందించింది. దీన్ని అంగీకరించిన అధికారులు.. ఆమెకి ఫ్రెష్ గా మరోసారి నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్సీబీ జోనర్ డైరెక్టర్ సమీర్ వాఖండే కూడా ముంబైలో లేరు. ఆయన ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. మరోపక్క ఆర్యన్ బెయిల్ కి సంబంధించి ఈరోజు ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. మరి ఈసారైనా అతడికి బెయిల్ వస్తుందేమో చూడాలి!

This post was last modified on October 26, 2021 12:08 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

6 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

7 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

8 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

8 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

9 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

10 hours ago