డ్రగ్స్ కేసు విషయంలో ఇప్పటికే హీరోయిన్ అనన్య పాండేను రెండుసార్లు విచారించగా.. ఇప్పుడు మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు. ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్ ఖాన్ ఫోన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అనన్య పాండేతో అతడు జరిపిన వాట్సాప్ చాట్స్ ను గుర్తించారు. ఆ చాట్ లో డ్రగ్స్ ప్రస్తావన ఉండడంతో అనన్య పాండే ఇంట్లో సోదాలు జరిపి.. ఆమె గాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
దశలవారీగా ఆమెని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆమె తనపై వస్తోన్న ఆరోపణలను ఖండించింది. డ్రగ్స్ కి సంబంధించి ఆర్యన్ తో తను జోక్ మాత్రమే చేశానని.. అంతకుమించి తనకేం తెలియదని ఎన్సీబీ అధికారుల ముందు చెప్పింది. అయితే ఆర్యన్ కు డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి వివరాల గురించి అనన్యకు తెలిసే ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు.
అనన్య ఈ వారంలోనే మరోసారి విచారణ కోసం ఎన్సీబీ ఆఫీస్ కు రాబోతుంది. లెక్కప్రకారం.. నిన్న ఆమె ఎన్సీబీ విచారణకు రావాలి. కానీ తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఎన్సీబీ అధికారులకు సందేశం అందించింది. దీన్ని అంగీకరించిన అధికారులు.. ఆమెకి ఫ్రెష్ గా మరోసారి నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్సీబీ జోనర్ డైరెక్టర్ సమీర్ వాఖండే కూడా ముంబైలో లేరు. ఆయన ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. మరోపక్క ఆర్యన్ బెయిల్ కి సంబంధించి ఈరోజు ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. మరి ఈసారైనా అతడికి బెయిల్ వస్తుందేమో చూడాలి!
This post was last modified on October 26, 2021 12:08 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…